News July 12, 2024

ఆదిలాబాద్: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్ మెంట్‌పై అవగాహన

image

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు అనిల్ గోస్వామి, జాట్ వీరి ఆధ్వర్యంలో శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలోని కళాశాలలో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్ మెంట్ కొరకు ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ ఈ నెల 28 వరకు ఉందని తెలిపారు. ఆ తదుపరి అక్టోబర్ 18, 2024న రిటన్ పరీక్ష ఉంటుందని తెలిపారు. ఆసక్తి గల యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Similar News

News February 14, 2025

BRS తప్పుడు ప్రచారాలను తిప్పి కొట్టాలి: ఖానాపూర్ MLA 

image

నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పేర్కొన్నారు. ఉట్నూర్‌లోని కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలతో సమావేశమై ఎమ్మెల్సీ, స్థానిక ఎన్నికలపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లో తీసుకెళ్లాలని, BRS తప్పుడు ప్రచారాలను తిప్పి కొట్టాలన్నారు.

News February 14, 2025

ADB: పట్టభద్రుల MLC బరిలో 56 మంది

image

ఉమ్మడి ADB, KNR, MDK, NZB పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు నిన్నటితో ముగిసింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో 13 మంది నామినేషన్లు ఉపసంహరించుకుని 56 మంది పోటీలో ఉన్నారు, ఉపాధ్యాయ స్థానానికి ఒకరు నామినేషన్ ఉపసంహరించుకున్నారు. 15 మంది పోటీ చేస్తున్నారు. ఈ నెల 27న పోలింగ్, మార్చి 3న ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలను ప్రకటిస్తారు.

News February 14, 2025

ADB: ఆధార్ సెంటర్ పర్యవేక్షించిన UIDAI అధికారి

image

రాష్ట్ర UIDAI ఆఫీస్ హైదరాబాద్ ప్రాజెక్ట్ మేనేజర్ నరేశ్ చంద్ర గురువారం ఆదిలాబాద్ కలెక్టరేట్ కార్యాలయంలోని ఆధార్ సెంటర్, ఈ సేవా ఆధార్ సెంటర్‌ని తనిఖీ చేశారు. ఆధార్ ఎన్రోల్మెంట్‌ వివరాలను, రికార్డ్ రిజిస్టర్‌లను పరిశీలించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. తనిఖీలో EDM రవి, మీసేవ ఫ్రాంచైజీ ఓనర్ తన్వీర్, జోగు సాగర్, స్వాగత, దయాకర్, శేషగిరి ఉన్నారు.

error: Content is protected !!