News March 5, 2025
ఆదిలాబాద్: ఇద్దరు మహిళా దొంగలు ARREST

ఇద్దరు మహిళా దొంగలను టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ కరుణాకర్ తెలిపిన వివరాలు.. మహారాష్ట్రకు చెందిన మైనా, జ్యోతి, వీరి భర్త తేజ్ షిండే మహారాష్ట్ర నుంచి రైలులో ఆదిలాబాద్ వచ్చి చోరీలు చేస్తూ తిరిగి వెళ్లిపోతున్నారు. మంగళవారం బస్టాండ్లో అనుమానస్పదంగా తిరుగుతుండగా ఆ ఇద్దరు మహిళలను SIవిష్ణుప్రకాశ్ అరెస్ట్ చేసి విచారించగా నేరాన్ని అంగీకరించారు. పరారీలో ఉన్న తేజ్ షిండే కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
Similar News
News December 14, 2025
ఆదిలాబాద్ జిల్లాలో 21.80% పోలింగ్

ఆదిలాబాద్ జిల్లాలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఉదయం 9 గంటల వరకు 21.80% ఓటింగ్ నమోదైంది. ఆదిలాబాద్(R)లో 20.05 బేల 19.63, జైనథ్19.42, బోరజ్ 23.60, భీంపూర్ 24.93, సాత్నాల 28.00, తాంసి 24.26, మావలలో 16.40 ఓటింగ్ నమోదైంది. ఓటర్లు చురుగ్గా పాల్గొంటున్నారు.
* జీపీ ఎలక్షన్ ఫలితాలకు Way2Newsను ఫాలో అవ్వండి.
News December 14, 2025
ఆదిలాబాద్: నేడే పోలింగ్.. మీరు రెడీనా?

జిల్లాలో నేడు జరిగే 2వ విడత పంచాయతీ ఎన్నికల్లో ఇప్పటికే 17 గ్రామ పంచాయతీల సర్పంచ్లు ఏకగ్రీవం అయ్యారు. ఎన్నికలు జరిగే 8 మండలాల్లో ఆదిలాబాద్(R)లో 4, బేల 1, జైనథ్ 1, బోరజ్ 1, భీంపూర్ 5, సాత్నాల 2, తాంసిలో ముగ్గురు సర్పంచ్లు ఏకగ్రీవం అయ్యారు. మిగిలిన పంచాయతీల్లో ఈరోజు పోలింగ్ జరగనుంది. ఉ.7గంటల నుంచి మ.1 వరకు పోలింగ్.. మధ్యాహ్నం ఫలితాలు ప్రకటిస్తారు. జీపీ ఎలక్షన్ ఫలితాలకు Way2Newsను ఫాలో అవ్వండి.
News December 13, 2025
అలాంటి చర్యలు చేపట్టిన వారిపై చర్యలు: ADB ఎస్పీ

రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఆదివారం సాయంత్రం ఆదిలాబాద్ రూరల్, బోరజ్, జైనథ్ మండలాల్లోని పలు పోలింగ్ కేంద్రాలను ఎస్పీ అఖిల్ మహాజన్ పరిశీలించారు. విధుల్లో ఉన్న సిబ్బందికి పలు సూచనలు చేశారు. రాత్రి సమయంలో ఓటర్లను ప్రభావితం చేసేలా మద్యం, డబ్బు, బహుమతులు పంపిణీ కాకుండా గస్తీ నిర్వహించాలన్నారు. నిర్భయంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు.


