News March 5, 2025

ఆదిలాబాద్: ఇద్దరు మహిళా దొంగలు ARREST

image

ఇద్దరు మహిళా దొంగలను టూటౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ కరుణాకర్ తెలిపిన వివరాలు.. మహారాష్ట్రకు చెందిన మైనా, జ్యోతి, వీరి భర్త తేజ్ షిండే మహారాష్ట్ర నుంచి రైలులో ఆదిలాబాద్ వచ్చి చోరీలు చేస్తూ తిరిగి వెళ్లిపోతున్నారు. మంగళవారం బస్టాండ్‌లో అనుమానస్పదంగా తిరుగుతుండగా ఆ ఇద్దరు మహిళలను SIవిష్ణుప్రకాశ్ అరెస్ట్ చేసి విచారించగా నేరాన్ని అంగీకరించారు. పరారీలో ఉన్న తేజ్ షిండే కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

Similar News

News December 20, 2025

నెరడిగొండ: 21 ఏళ్లకే ఉప సర్పంచ్‌గా..

image

పంచాయతీ ఎన్నికల్లో భాగంగా నెరడిగొండ మండలం బుద్దికొండకు చెందిన 21 ఏళ్ల యువకుడు సాబ్లే రతన్ సింగ్‌ను గ్రామ ఉపసర్పంచ్‌గా ఎన్నుకున్నారు. అతి పిన్న వయసులోనే బాధ్యతలు చేపట్టి రతన్ సింగ్ రికార్డు సృష్టించారు. తనపై నమ్మకంతో గెలిపించిన గ్రామస్తులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. యువత తలచుకుంటే ఏదైనా సాధ్యమని, గ్రామ అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేసి ప్రజల నమ్మకాన్ని నిలబెడతానని ధీమా వ్యక్తం చేశారు.

News December 20, 2025

గ్రామ పంచాయతీల అభివృద్ధి మీ బాధ్యతే: కలెక్టర్

image

గ్రామ పంచాయతీల అభివృద్ధి బాధ్యత నూతన సర్పంచులదేనని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. నార్నూర్ పంచాయతీ సర్పంచిగా తన కూతురు బాణోత్ కావేరి గెలుపొందడంతో సర్పంచుల సంఘం రాష్ట్ర మాజీ కార్యదర్శి గజానంద్ నాయక్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావుతో కలిసి శుక్రవారం కలెక్టర్‌ను శాలువాతో సత్కరించారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలు చేసిన నీతి అయోగ్ కార్యక్రమానికి నార్నూర్ మండలం ఎంపిక కావడం గొప్ప విషయమన్నారు.

News December 19, 2025

ఆదిలాబాద్: వ్యవసాయ సమస్యలపై కలెక్టర్ చర్చ

image

ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా శుక్రవారం కలెక్టరేట్ సమావేశంలో రైతులు, సంబంధిత అధికారులతో కలిసి సొయాబిన్ పంట కొనుగోళ్లు, ఫర్టిలైజర్ బుకింగ్ యాప్, ఇతర వ్యవసాయ సమస్యలపై సమగ్ర చర్చ నిర్వహించారు. సమావేశంలో రైతుల తరపున పలువురు నాయకులు మార్కెట్లో సొయాబిన్ పంట కొనుగోలు సమయంలో ఎదుర్కొంటున్న సమస్యలు, అధిక వర్షాల కారణంగా పంట రంగు మారడం, మద్దతు ధర ప్రకారం రైతులను ఆదుకోవాలన్న అంశాలను వివరించారు.