News May 26, 2024
ఆదిలాబాద్: ఈ ఏడాది తగ్గిన రిజిస్ట్రేషన్లు..!

ఆదిలాబాద్ జిల్లాలో రిజిస్ట్రేషన్లు గతేడాదితో పోల్చితే ఈ ఏడాది భారీగా తగ్గాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతగా లేకపోవడంతో భూములు, ప్లాట్లు, ఇళ్ల క్రయ విక్రయాలు ఆశించిన స్థాయిలో జరగలేదని తెలుస్తోంది. జిల్లాలోని ఆదిలాబాద్, బోథ్ రెండు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో గతేడాదితో పోల్చితే ఈ ఏడాది 1,342 రిజిస్ట్రేషన్లు తగ్గాయి. దీంతో ఆ శాఖకు సుమారు రూ.7.3కోట్ల ఆదాయం తగ్గింది.
Similar News
News April 15, 2026
చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి: కలెక్టర్ రాజర్షి షా

జిల్లాలోని పట్టణాలు, గ్రామాలు, ప్రధాన కూడళ్ల వద్ద చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియలో స్వచ్ఛంద సంస్థలు, రెడ్క్రాస్ను భాగస్వామ్యం చేయాలని సూచించారు. చలివేంద్రాల్లో తాగునీటితో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. ఎండల దృష్ట్యా ప్రజలు తగినంత నీరు తాగుతూ శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుకోవాలని ప్రకటనలో కోరారు.
News April 15, 2026
జిల్లాలో సెగలు.. అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

జిల్లావ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. సాధారణం కంటే 1.5°C నుంచి 3.5°C వరకు ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని, వారం రోజుల పాటు వేడి గాలులు వీస్తాయని తెలిపారు. ఎండల తీవ్రత దృష్ట్యా జిల్లాలో ‘హీట్వేవ్ యాక్షన్ ప్లాన్’ను అత్యవసరంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. అప్రమత్తతే ఎండ దెబ్బ నుంచి రక్షిస్తుందని పేర్కొన్నారు.
News April 15, 2026
ADB: ’పల్లె వెలుగు’కు మాస్క్.. ఛార్జీల్లో ‘ఎక్స్ప్రెస్’

జిల్లాలోని ఆర్టీసీ డిపోల పరిధిలో ప్రయాణికులను నిలువునా దోపిడీ చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ‘పల్లె వెలుగు’ బస్సులకు ముందు భాగంలో ‘ఎక్స్ప్రెస్’ రంగులు వేసి, లోపల మాత్రం సాధారణ సౌకర్యాలతోనే నడుపుతున్నారు. కానీ, టికెట్ ఛార్జీలు మాత్రం ఎక్స్ప్రెస్ ధరలకే వసూలు చేస్తుండటం గమనార్హం. ఆదిలాబాద్ రీజియన్ పరిధిలోని డిపోల్లో బస్సులు చాలా ఉన్నాయని, దీనివల్ల ప్రయాణికులు మండిపడుతున్నారు.


