News April 25, 2024
ఆదిలాబాద్: ఈ నెల 25 నుంచి ఓటర్ స్లిప్పుల పంపిణీ

ఈ నెల 25 నుంచి ఓటర్ స్లిప్పుల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నట్లు రిటర్నింగ్ అధికారి రాజర్షి షా తెలిపారు. మంగళవారం అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి పంపిణీకి ఏర్పాట్లను సిద్ధం చేయాలని ఆదేశించారు. అందరికి ఓటర్ స్లిప్ ఇవ్వడంతో పాటు ఓటర్ గైడ్ను కూడా అందించాలన్నారు. గ్రామాలు, మున్సిపాలిటీల్లో బూత్ స్థాయి అధికారులు ఓటర్ స్లిప్పులు పంపిణీలో నిర్లక్ష్యం వహించకూడదన్నారు.
Similar News
News October 16, 2025
ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ డీపీఆర్ఓగా విష్ణువర్ధన్

ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ జిల్లా పౌర సంబంధాల అధికారి (డిపిఆర్ఓ)గా ఎల్చల విష్ణువర్ధన్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ రాజార్షి షాను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. కలెక్టర్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా పౌర సంబంధాల విభాగం పనితీరు మరింత ప్రభావవంతంగా ఉండేలా కృషి చేయాలని సూచించారు.
News October 16, 2025
ఫ్లాగ్ డే వారోత్సవాలు ఘనంగా నిర్వహించాలి: ADB SP

ఫ్లాగ్ డే వారోత్సవాలు ఘనంగా నిర్వహించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ప్రజాసేవలో అమరులైన జిల్లా పోలీసుల జ్ఞాపకార్థం పలు కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. అక్టోబర్ 21న ఫ్లాగ్ డే ఉంటుందన్నారు. పోలీస్ పరేడ్ మైదానంలో ఈ నెల 22న మెగా రక్తదానం, 23న ఓపెన్ హౌస్, పట్టణంలో సైకిల్ ర్యాలీ, 24న 5కే రన్ చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
News October 16, 2025
ADB: ఆ కుటుంబం ఊపిరి తీసిన రహదారులు

వరుస రోడ్డు ప్రమాదాలు ఆ కుటుంబం ఉసురు తీశాయి. కొన్నేళ్ల కిందట పందులు అడ్డు రావడంతో జరిగిన ప్రమాదంలో స్టీఫెన్ భార్య వాహనంపై నుంచి జారిపడి చనిపోయారు. ఈ విషాదం మరువక ముందే, బుధవారం భిక్కనూరులో జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో స్టీఫెన్, ఆయన పెద్ద కుమార్తె జాస్లీన్, ఆమె ఇద్దరు పిల్లలు కూడా మృతి చెందారు. వరుసగా ముగ్గురు కుటుంబ సభ్యులు మృతి చెందడంతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది.