News October 26, 2024
ఆదిలాబాద్: ఈ సోమవారం ప్రజావాణి రద్దు

అదిలాబాద్ కలెక్టరేట్ సమావేశంలో మందిరంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో భాగంగా ఈ నెల 28న నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. ఈ నెల 28న జిల్లాకు బీసీ కమిషన్ బృందం రానున్న నేపథ్యంలో రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయం ప్రజలు గమనించాలని మరొక సోమవారం యథాతథంగా ప్రజావాణి ఉంటుందని స్పష్టం చేశారు.
Similar News
News February 24, 2026
ఆదిలాబాద్: ఎయిర్ పోర్ట్ మాస్టర్ ప్లాన్ను పరిశీలించిన ఎంపీ, ఎమ్మెల్యే

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఏరోడ్రమ్ ప్రాంతంలో ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్తో కలిసి ఎయిర్ పోర్ట్ మాస్టర్ ప్లాన్ను పరిశీలించారు. మాస్టర్ ప్లాన్కు అనుగుణంగా ఎన్ని ఎకరాలు ఎక్కడి వరకు ఎన్ని భూములు వెళ్తున్నాయో మ్యాప్ ఆధారంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ తాటిపళ్లి గంగాధర్ రావు, కనపర్తి చంద్రకాంత్, కౌన్సిలర్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
News February 24, 2026
ఆదిలాబాద్: రూ.1,000 కోట్లు ఎక్కడివి: కేటీఆర్

గాంధీ కుటుంబానికి రూ.1,000 కోట్లు ఇవ్వడానికి సిద్ధమని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల డబ్బులు తన అయ్యా సొమ్మా అని కేటీఆర్ ఘాటుగా వ్యాఖ్యానించారు. జిల్లా జైల్లో ఉన్న బాల్క సుమన్తో ములాఖత్ అయిన తర్వాత మీడియాతో మాట్లాడారు. రైతులకు రైతు బంధు కోసం డబ్బులు లేవు గానీ, గాంధీ కుటుంబానికి రూ.1,000 కోట్లు ఇచ్చేందుకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. కేంద్ర సంస్థలు ఏమి చేస్తున్నాయన్నారు.
News February 24, 2026
ఆదిలాబాద్: సుమన్కు జైలు కొత్త కాదు: కేటీఆర్

మాజీ ఎంపీ, బాల్క సుమన్కు జైలులో ఉండటం కొత్తేమీ కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆదిలాబాద్ జైలులో ఉన్న బాల్క సుమన్తో ములాఖత్ అయ్యాక కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. గతంలో తెలంగాణ ఉద్యమం సమయంలో సుమన్ ఎన్నో సార్లు జైలుకు వెళ్లి వచ్చారన్నారు. జైలులో పెడితే సుమన్ భయపడతారని కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటే పొరపాటేనన్నారు.


