News April 3, 2025
ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్కు IAF నుంచి పత్రం

ఆదిలాబాద్ పట్టణంలో నూతన ఎయిర్పోర్ట్ మంజూరు కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్(IAF) రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. AIRPORT నిర్మాణానికి ప్రభుత్వం పంపిన వినతి పత్రాన్ని అంగీకరిస్తున్నామని, త్వరలో ఎయిర్పోర్ట్ వద్ద రోడ్లు, బిల్డింగ్ తదితర భవనాలను నిర్మిస్తామని పత్రంలో పేర్కొంది. దీంతో ఎయిర్పోర్ట్ కోసం పోరాడిన సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఎంపీ గోడం నగేష్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News April 12, 2025
హనుమాన్ శోభాయాత్రకు భారీ బందోబస్తు: SP

హనుమాన్ శోభాయాత్రకు ADBలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. 300మంది సిబ్బందితో బందోబస్తు ప్రక్రియ కొనసాగుతుందన్నారు. వీడియో కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో, ప్రత్యేక సీసీ టీవీలతో పర్యవేక్షణ ఉంటుందన్నారు. ర్యాలీ పూర్తయ్యేంతవరకు హనుమాన్ విగ్రహానికి ఇరువైపులా పోలీసు సిబ్బంది ఉంటారన్నారు. అదేవిధంగా ర్యాలీ జరుగు ప్రదేశాల్లో ట్రాఫిక్ డైవర్షన్ ఉంటుందని సూచించారు.
News April 12, 2025
ADB: ఈ నెల 21 నుంచి డిగ్రీ సెమిస్టర్స్

కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ 2, 4, 5, 6వ సెమిస్టర్లకు సంబంధించిన పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 21 నుంచి ప్రారంభమవుతున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ కట్ల రాజేందర్ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన టైం టేబుల్ను విడుదల చేశారు. పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్లో చూడాలని విద్యార్థులకు సూచించారు.
News April 12, 2025
నేరడిగొండలో 52 మందికి TB పాజిటివ్

నేరడిగొండ మండలంలో నెల క్రితం పీహెచ్సీ వైద్యుల ఆధ్వర్యంలో టీబీ పరీక్షలు నిర్వహించారు. వారిలో మొత్తం 52 మందికి టీబీ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు శుక్రవారం హెచ్ఈఓ పవార్ రవీందర్ వెల్లడించారు. శుక్రవారం 25 మందికి పరీక్షలు చేసినట్లు తెలిపారు. టీబీ బాధితులకు 6 నెలల వైద్యంతో పాటు నెలకు రూ.1000, పోషణ న్యూట్రిషన్ కిట్ ఇవ్వనున్నామన్నారు. ఆయనతో పాటు ఉత్తమ్ కుమార్, సంతోష్, తదితరులున్నారు.