News October 4, 2024
ఆదిలాబాద్: ఏకంగా భాష నేర్చుకుని జాబ్ కొట్టింది..

ఉట్నూరు మండలం లక్కారం మసీదు ఏరియాలో నివాసముండే న్యాయవాది పవార్ వసంత్ కూతురు మౌనిక డీఎస్సీ ఉర్దూ మాధ్యమంలో ఎస్జీటీగా ఎంపికయ్యారు. ఇంటి చుట్టూ ఉన్న ముస్లింలతో ఉర్దూ భాషలో మాట్లాడటం చేసుకున్న ఆ యువతికి ఆ భాషే చివరకు ఉద్యోగాన్ని సాధించిపెట్టింది. ఎస్టీ విభాగంలో రెండు పోస్టులు రిజర్వు చేయడంతో ఆమెకు ఉద్యోగం దక్కడం లాంఛనమే. ఉర్దూ భాషను మిత్రులతో పాటు యూట్యూబ్ సాయంతో నేర్చుకున్నట్లు మౌనిక తెలిపారు
Similar News
News November 22, 2025
ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడిగా నరేష్ జాదవ్

కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడి నియామకం జరిగింది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ నరేష్ జాదవ్ను డీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తూ ఏఐసీసీ జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ శనివారం రాత్రి ఉత్తర్వులు ఇచ్చారు. గతంలో నరేష్ జాదవ్ ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేసిన విషయం తెలిసిందే.
News November 22, 2025
నార్నూర్: రికార్డు సాధించిన ఏకలవ్య పాఠశాల

నార్నూర్లోని ప్రభుత్వ గురుకుల ఏకలవ్య పాఠశాల రికార్డు సాధించింది. ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు ఒడిశాలో జరిగిన 4వ జాతీయ EMRS క్రీడా సమ్మిట్లో విద్యార్థులు పాల్గొని నేరుగా 11 స్వర్ణాలు, 15 వెండి, 13 కాంస్య పథకాలు గెలుపొందారు. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో పేరు పొందడంతో శనివారం క్రీడాకారులను పాఠశాల సిబ్బంది అభినందించారు.
News November 22, 2025
నార్నూర్: రికార్డు సాధించిన ఏకలవ్య పాఠశాల

నార్నూర్లోని ప్రభుత్వ గురుకుల ఏకలవ్య పాఠశాల రికార్డు సాధించింది. ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు ఒడిశాలో జరిగిన 4వ జాతీయ EMRS క్రీడా సమ్మిట్లో విద్యార్థులు పాల్గొని నేరుగా 11 స్వర్ణాలు, 15 వెండి, 13 కాంస్య పథకాలు గెలుపొందారు. ఈ నేపథ్యంలో జాతీయ స్థాయిలో పేరు పొందడంతో శనివారం క్రీడాకారులను పాఠశాల సిబ్బంది అభినందించారు.


