News May 20, 2024
ఆదిలాబాద్: ఒకేరోజు రెండు పరీక్షలు… రాసేదెలా?

పలువురు విద్యార్థులకు ఒకేరోజు టెట్, డిగ్రీ సెమిస్టర్ పరీక్ష ఉండడంతో ఆందోళన చెందుతున్నారు. ఈ నెల 30న KUకి సంబంధించిన డిగ్రీ Bsc, BA అలాగే అదే రోజు టెట్ పరీక్ష ఉంది. దీంతో డిగ్రీ పరీక్ష రాయలా? టెట్ పరీక్ష రాయలా?, రెండు రాసేదెలా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టెట్ పరీక్ష రాస్తే డిగ్రీ సప్లిమెంటరీకి విద్యార్థులకు మరో సంవత్సరం ఆగాల్సి వస్తుంది. టైం టేబుల్ మార్చాలని విద్యార్థులు కోరుతున్నారు.
Similar News
News November 18, 2025
ADB: పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పెంపు: డీఈఓ

పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే రెగ్యులర్, ఫెయిల్ విద్యార్థుల పరీక్ష రుసుమును చెల్లించేందుకు తేదీలను పొడిగిస్తున్నట్లు డీఈఓ రాజేశ్వర్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఆన్లైన్లో ఇంటర్ గేషన్ సైబర్ ట్రెజరీ ద్వారా ఫీజు చెల్లించాలని తెలిపారు. పరీక్ష రుసుముల వివరాల కోసం http://bse.telangana.gov.in వెబ్సైట్ను చూడాలని ఆయన సూచించారు.
News November 18, 2025
ADB: పదో తరగతి పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పెంపు: డీఈఓ

పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే రెగ్యులర్, ఫెయిల్ విద్యార్థుల పరీక్ష రుసుమును చెల్లించేందుకు తేదీలను పొడిగిస్తున్నట్లు డీఈఓ రాజేశ్వర్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఆన్లైన్లో ఇంటర్ గేషన్ సైబర్ ట్రెజరీ ద్వారా ఫీజు చెల్లించాలని తెలిపారు. పరీక్ష రుసుముల వివరాల కోసం http://bse.telangana.gov.in వెబ్సైట్ను చూడాలని ఆయన సూచించారు.
News November 18, 2025
ADB: ఫిర్యాదులు విన్న వెంటనే పరిష్కారానికి ఆదేశం: ఎస్పీ

ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ సోమవారం పోలీస్ ముఖ్య కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 23 మంది ఫిర్యాదుదారుల సమస్యలను ఆయన విన్నారు. ఎస్పీ వెంటనే సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ ద్వారా పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. సుదూర ప్రాంతాల ప్రజలు 8712659973 నంబర్కు వాట్సాప్తో సమస్యలు తెలపాలని, సమాచారమిచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎస్పీ తెలిపారు.


