News October 19, 2024
ఆదిలాబాద్: ఒకే రోజు ముగ్గురి సూసైడ్

ఆదిలాబాద్ జిల్లాలో వేర్వేరు కారణాలతో శుక్రవారం ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. వివరాలిలా.. ఆదిలాబాద్ శాంతినగర్కి చెందిన హరికృష్ణ(27) అనారోగ్యంతో మత్తడివాగు ప్రాజెక్టు వద్ద సూసైడ్ చేసుకున్నాడు. కొలాంగూడ అటవీ ప్రాంతంలో మనస్తాపంతో ముత్నూర్కు చెందిన మాణిక్రావు ఉరేసుకోగా.. భుక్తాపూర్కు చెందిన హన్మాండ్లు ఇంట్లో ఉరేసుకున్నాడు. భార్య మృతిచెందినప్పటి నుంచి మద్యానికి బానిసై ఉరేసుకున్నట్లు సీఐ తెలిపారు.
Similar News
News December 6, 2025
ADB: సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు వద్దు: ఎస్పీ

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలో సున్నితమైన వాతావరణం నెలకొంటుందని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సోషల్ మీడియాలో వర్గాలను రెచ్చగొట్టేలా పోస్టులు, వ్యాఖ్యలు చేసిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించిన వారిపై పోలీసు చర్యలు ఉంటాయన్నారు.
News December 6, 2025
ADB: ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి: కలెక్టర్

గ్రామ పంచాయతీ ఎన్నికలను సమర్థవంతంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని కలెక్టర్ రాజర్షి షా ఆదేశించారు. ఆదిలాబాద్ జడ్పీ సమావేశ మందిరంలో మూడు విడతల ఎన్నికల సూక్ష్మ పరిశీలకులు (మైక్రో అబ్జర్వర్లు), జోనల్ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన ఈ సూచనలు చేశారు. ప్రతి సూక్ష్మ పరిశీలకులకు ఒక గ్రామ పంచాయతీని కేటాయిస్తామని, ఆ పరిధిలోని అన్ని వార్డులను పరిశీలించాల్సి ఉంటుందని తెలిపారు.
News December 6, 2025
ఆదిలాబాద్: మహిళల్లో ఆత్మవిశ్వాసం పెరగాలి: కలెక్టర్

ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ధైర్యంగా ఎదుర్కొనే ఆత్మవిశ్వాసం మహిళల్లో పెరగాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మహిళలపై హింసకు వ్యతిరేకంగా అంతర్జాతీయ ప్రచారోద్యమం నేపథ్యంలో, ఆదిలాబాద్లోని న్యూ అంబేద్కర్ భవన్లో సఖి కేంద్రం, జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. మహిళలపై హింస నిర్మూలనకు సమాజమంతా ముందుకు రావాల్సిన అవసరం ఉందని కలెక్టర్ పేర్కొన్నారు.


