News June 3, 2024

ఆదిలాబాద్: ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి

image

పెద్దపల్లి లోక్‌సభ స్థానం ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. 20 రోజుల ఉత్కంఠకు రేపటితో తెర పడనుంది. సెంటీనరీ కాలనీలోని JNTUH ఇంజినీరింగ్ కాలేజీలో ఓట్ల లెక్కింపు రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభం కానుంది. ప్రతి శాసన సభ నియోజకవర్గానికి 14 టేబుళ్ల చోప్పున ఏర్పాటు చేస్తున్నారు. పెద్దపల్లి లోక్‌సభ పరిధిలో మొత్తం 15,96,430 మంది ఓటర్లు ఉండగా, 10,83,453 ఓట్లు పోలయ్యాయి.

Similar News

News November 12, 2025

ఆదిలాబాద్: రేపు జోనల్ స్థాయి యోగా పోటీలు

image

ఇచ్చోడ మండలంలోని బోరిగామా జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలో 14 – 17 సంవత్సరాల బాలబాలికలకు జోనల్ స్థాయి యోగా పోటీలను ఈ నెల 13న నిర్వహిస్తున్నట్లు DEO రాజేశ్వర్, SGF జిల్లా కార్యదర్శి రామేశ్వర్ పేర్కొన్నారు. ఇందులో గెలుపొందిన వారికి రాష్ట్రస్థాయి యోగా పోటీలు కరీంనగర్ జిల్లాలోని వెలిచల రామడుగు జిల్లా పరిషత్ పాఠశాలలో ఉంటాయని పేర్కొన్నారు. 15, 16, 17 మూడు రోజులపాటు రాష్ట్ర స్థాయి పోటీలు జరుగుతాయని వివరించారు.

News November 12, 2025

ఆదిలాబాద్: పనులను నిర్ణీత గడువులో పూర్తిచేయాలి

image

ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన మౌలిక సదుపాయాల పనులను నిర్ణీత గడువులో పూర్తిచేయాలని కలెక్టర్‌ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బజార్‌హత్నూర్‌, ఇంద్రవెల్లి, తలమడుగు, తాంసి, ఉట్నూర్‌ మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక సదుపాయాల పురోగతిపై రెండవ దశ సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యార్థుల భవిష్యత్తు బలోపేతానికి పాఠశాలల్లో సమగ్ర మౌలిక సదుపాయాలు తప్పనిసరి అన్నారు.

News November 12, 2025

ADB: కౌలు రైతులు వెంటనే పంట నమోదు చేసుకోవాలి

image

ఆదిలాబాద్ జిల్లాలోని కౌలు రైతులు అలాగే డిజిటల్ సంతకం లేని భూములు, పీపీ భూములు, పార్ట్–3 భూములు కలిగిన రైతులు వెంటనే పంట నమోదు చేసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. కనీస మద్దతు ధరకు తమ పంటను విక్రయించే అవకాశాన్ని కోల్పోకుండా ఈ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. కౌలు రైతులు తమ పంటను సీసీఐ కేంద్రాల్లో అమ్మకానికి నమోదు చేసుకోవాలంటే ఏఈఓ వద్ద వివరాలు నమోదు చేసుకోవాలని వివరించారు.