News July 30, 2024
ఆదిలాబాద్: ఓపెన్ డిగ్రీ, పీజీలో ప్రవేశాలు షురూ

డా.బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీలో డిగ్రీ, పీజీలో ప్రవేశాలకై నోటిఫికేషన్ విడుదలైనట్లు ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ ప్రతాప్ సింగ్ పేర్కొన్నారు. డిగ్రీ, పీజీలో తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా విద్యార్థులు తమకు నచ్చిన కోర్సులో చేరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. AUG 18 వరకు ONLINEలో దరఖాస్తులు చేసుకోవచ్చని వివరాలకు https://www.braouonline.in/ సందర్శించండి.
Similar News
News January 10, 2026
ఉద్యోగాల పేరుతో మోసం చేస్తే కఠిన చర్యలు: ADB SP

ఆదిలాబాద్ జిల్లా ప్రజలు ఉద్యోగాల పేరుతో మోసం చేసే మూఠా సభ్యులను, డబ్బులు అడిగే ముఠాలను నమ్మవద్దని, అలాంటి వారి పట్ల అప్రమత్తతో వ్యవహరించాలని SP అఖిల్ మహాజన్ సూచించారు. డబ్బులతో ప్రభుత్వ ఉద్యోగాలు రావని.. కష్టపడి పరీక్షల ద్వారా ఉద్యోగాలను సాధించాలన్నారు. నకిలీ ఉద్యోగాల పేరుతో మోసం చేసే వారిపై జిల్లా పోలీసు యంత్రాంగం కఠినమైన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు.
News January 9, 2026
ఆదిలాబాద్: 12న పీఎం నేషనల్ అప్రెంటిషిప్ మేళా

ఆదిలాబాద్ జిల్లాలోని ప్రభుత్వ ఐటీఐ, ఏటీసీ కళాశాలల్లో ఈనెల 12న ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిషిప్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. ఐటీఐ పూర్తి చేసిన విద్యార్థులు అప్రెంటిషిప్ మేళాను సద్వినియోగం చేసుకుంటే చదువుతూనే డబ్బులు సంపాదించవచ్చన్నారు. ఇతర రాష్ట్రాల్లోని కంపెనీల్లో కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు.
News January 9, 2026
మావల: నకిలీ పత్రాలతో భూ కబ్జా.. నిందితుడి అరెస్టు

మావల పోలీస్ స్టేషన్ పరిధిలో భూమి పత్రాలు నకిలీ చేసి అక్రమంగా స్థలం ఆక్రమించిన కేసులో ప్రధాన నిందితుడు దుర్వ నాగేశ్ను అరెస్ట్ చేసినట్లు మావల సీఐ కర్ర స్వామి తెలిపారు. నకిలీ అమ్మకపు ఒప్పంద పత్రాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామన్నారు. పరారీలో ఉన్న సహ నిందితురాలి కోసం గాలింపు కొనసాగుతోందన్నారు. అమాయకుల వద్ద రూ.కోట్ల విలువైన భూమిని కబ్జాకు ప్రయత్నం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.


