News February 20, 2025
ఆదిలాబాద్: కాంగ్రెస్ పార్టీలో చేరికలు

వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని అందించాలని అసెంబ్లీ ఇన్చార్జి కంది శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. కార్యకర్తలే పార్టీకి బలమని పేర్కొన్నారు. బుధవారం ప్రజాసేవ భవన్ లో కార్యక్రమం నిర్వహించారు. కష్టపడి పనిచేసినవారికి కాంగ్రెస్లో తప్పకుండా గుర్తింపు ఉంటుందన్నారు. బీఆర్ఎస్, బీజేపీ నుంచి కాంగ్రెస్ లో పలువురు చేరారు.
Similar News
News October 31, 2025
ADB: ఏకలవ్య గురుకులాల ప్రిన్సిపల్స్తో కలెక్టర్ సమీక్ష

కలెక్టరేట్లో గురువారం ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని కలెక్టర్ రాజర్షి షా నిర్వహించారు. ఏకలవ్య పాఠశాలల అభివృద్ధి, విద్యార్థులకు అందిస్తున్న వసతులు, నాణ్యమైన విద్యపై ఆయన ప్రిన్సిపల్స్ను ఆరా తీశారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ సలోని చబ్రా, డీఎంహెచ్వో, ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
News October 30, 2025
ఆదిలాబాద్: ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రీషెడ్యూల్

ఆదిలాబాద్ నుంచి గురువారం దయం 8 గంటలకు బయలుదేరాల్సిన ఆదిలాబాద్-నాందేడ్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ సమయాన్ని రైల్వే శాఖ రీషెడ్యూల్ చేసింది. ఈ రైలు ఉదయం 8 గంటలకు బదులుగా ఉదయం 11 గంటలకు ఆదిలాబాద్ నుంచి బయలుదేరుతుంది. అలాగే, ఈ రైలు సేవలను ముద్ఖేడ్-నాందేడ్-ముద్ఖేడ్ మధ్య పాక్షికంగా రద్దు చేసినట్లు రైల్వే శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
News October 30, 2025
ADB: కేయూ ఫీజు గడువు పెంపు

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 1, 3, 5 సెమిస్టర్ పరీక్షలకు సంబంధించిన ఫీజు చెల్లింపు గడువును మరొకసారి పొడగిస్తున్నట్లు KU అధికారులు పేర్కొన్నారు. ఈ నెల 29 వరకు అపరాధ రుసుముతో ఫీజు చెల్లించడానికి గడువు ముగిసింది. అదే అపరాధ రుసుముతో NOV 03 వరకు పొడగించినట్లు వెల్లడించారు. నవంబర్ నెలలో పరీక్షలు ఉంటాయని వివరించారు. విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి సకాలంలో ఫీజు చెల్లించాలని సూచించారు.


