News December 27, 2024
ఆదిలాబాద్: కేయూ పరిధిలో పరీక్షలు వాయిదా
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1735268504034_50249255-normal-WIFI.webp)
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం దృష్ట్యా కాకతీయ యూనివర్సిటీ యూనివర్సిటీ పరిధిలో నేడు జరగాల్సిన పరీక్షలకు వాయిదా వేస్తున్నట్లు KU అధికారులు పేర్కొన్నారు. నేడు ఉదయం జరగాల్సిన డిగ్రీ 5వ సెమిస్టర్ పరీక్ష, మధ్యాహ్నం జరగాల్సిన 1వ సెమిస్టర్ పరీక్ష వాయిదా వేశారు. ఈ పరీక్షలు డిసెంబర్ 31 మంగళవారం జరుగుతాయని స్పష్టం చేశారు. కావున ఉమ్మడి జిల్లా విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.
Similar News
News January 14, 2025
BREAKING: అప్పుడే పుట్టిన శిశువును పడేసిన తల్లి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1736864845503_1285-normal-WIFI.webp)
సారంగాపూర్ మండలంలోని జాం గ్రామంలో అప్పుడే పుట్టిన పసికందు లభ్యమైంది. ఏ తల్లి కన్నదో తెలియదు. భారం అనుకుందో.. బరువనుకుందో కానీ.. మాతృత్వాన్ని మరిచిన ఓ తల్లి.. అప్పుడే పుట్టిన శిశువును కోమటి చెరువు సమీపంలో పడేసి వెళ్లిపోయింది. అటుగా వెళ్తున్న ఓ గ్రామస్థుడు శిశువును చూసి స్థానికులకు సమాచారం అందించాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News January 14, 2025
బెల్లంపల్లి: రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1736848695250_51751205-normal-WIFI.webp)
సంక్రాంతి పండగపూట బెల్లంపల్లిలో విషాదం నెలకొంది. కాగజ్నగర్కు చెందిన రాజేశ్ HYDలో మెకానిక్ ఇంజినీర్గా పనిచేస్తున్నాడు. టూ టౌన్ SI మహేందర్ కథనం ప్రకారం.. రాజేశ్ తన భార్య, కుమారుడితో కారులో మంగళవారం కాగజ్నగర్ వెళ్తున్నారు. బెల్లంపల్లి గంగారంనగర్ హైవేపై లారీని ఢీకొట్టాడు. ప్రమాదంలో అతడి భార్య రేణుక(30) అక్కడికక్కడే మరణించింది. తీవ్రగాయాలపాలైన రాజేశ్ను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతున్నాడు.
News January 14, 2025
జాతరకు రావాలని ఏలేటి మహేశ్వర్ రెడ్డికి ఆహ్వానం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1736845846085_50150803-normal-WIFI.webp)
సారంగాపూర్ మండలం పొట్య గ్రామ పంచాయతీ పరిధిలోని బండ్రేవు తండాలో నాను మహరాజ్ జాతర ఉత్సవాలకు బీజేపీ శాసన సభ పక్ష నేత నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డికి నాను మహారాజ్ జాతర ఉత్సవ కమిటీ సభ్యులు ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు నారాయణ, దావుజీ, ప్రకాష్,జాతర ఉత్సవ కమిటీ సభ్యులు బంజారా నాయకులు తదితరులు పాల్గొన్నారు.