News December 3, 2024
ఆదిలాబాద్ జిల్లాకు నూతనంగా ఐదు 108 అంబులెన్సులు

ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఆరోగ్య దినోత్సవ కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లాకు నూతనంగా ఐదు 108 అంబులెన్స్ లను ప్రభుత్వం కేటాయించింది. ప్రజా పాలన విజయోత్సవాల భాగంగా రాష్ట్రవ్యాప్తంగా కేటాయించిన అంబులెన్స్ లను సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులతో కలిసి హైదరాబాద్లో ప్రారంభించారు. ఈ ఐదు అంబులెన్స్లను ఉట్నూర్, ఇంద్రవెల్లి, గాదిగూడ, ఇచ్చోడ, తాంసి మండలాలకు అధికారులు కేటాయించారు.
Similar News
News February 8, 2026
ADB: ఈ నెల 11న సెలవు

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఫిబ్రవరి 11 (బుధవారం)న స్థానిక సెలవు ప్రకటించినట్లు ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికలు జరిగే పురపాలక సంఘాల పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు, ఇతర ప్రభుత్వ సంస్థలు ఆ రోజున మూసివేస్తామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.
News February 7, 2026
ఉట్నూర్: పట్టుపురుగుల పెంపకంపై అవగాహన కల్పించాలి

గిరిజన రైతులకు మల్బరీ పంట సాగుపై అలాగే పట్టుపురుగుల పెంపకంపై అవగాహన కల్పించి, గిరిజన రైతులకు మంచి ఆదాయం వచ్చేలాగా కృషి చేయడానికి ప్రయత్నం చేయాలని ITDA PO యువరాజ్ మర్మాట్ స్పష్టం చేశారు. శనివారం వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. మల్బరీ తోటల సాగుకు రైతులను ఎంపిక చేయాలని, వారికి కావలసిన రాయితీ వివరాలను వివరించేలా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
News February 7, 2026
ఈ నెల 9న సా.5 గంటలకు ప్రచారం బంద్: ADB కలెక్టర్

మున్సిపల్ పోలింగ్కు 48 గంటల ముందు అంటే ఈ నెల 9న సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియాలని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. బహిరంగ సభలు, ఊరేగింపులు నిషేధమని, ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే విధంగా సినిమాలు, టీవీ లేదా ఇతర మాధ్యమాల ద్వారా ప్రచారం చేయరాదన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలతో పాటు 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా జరిమానా విధించే అవకాశం ఉందన్నారు.


