News July 6, 2024

ఆదిలాబాద్: నిజాయితీ చాటుకున్న యువకుడు

image

పోగొట్టుకున్న పర్సును అందజేసి ఓ యువకుడు నిజాయితీ చాటుకున్నాడు. నేరడిగొండకు చెందిన చిప్పరి రాజేశ్వర్ అనే యువకుడు శుక్రవారం రాత్రి ఆదిలాబాద్ రిమ్స్‌లో పర్సు పోగొట్టుకున్నాడు. సాహిల్ ససానే అనే యువకుడికి పర్సు దొరికింది. ఐడీ, ఆధార్ కార్డులతో పాటు దాదాపు రూ.5 వేల నగదు ఉంది. గుర్తింపుకార్డు ఆధారంగా బాధితుడిని గుర్తించి టైగర్‌ గ్రూప్‌ అధ్యక్షుడు జాదవ్‌ గోపాల్‌ ఆధ్వర్యంలో శనివారం అందజేశారు.

Similar News

News October 13, 2024

ఆసిఫాబాద్: ‘లక్మాపూర్ వాగుపై వంతెన నిర్మించాలి’

image

కెరమెరి మండలం లక్మాపూర్ గ్రామస్థులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లక్మాపూర్ వాగుపై వంతెన లేకపోవడంతో ఆసుపత్రికి పోవాలన్నా, నిత్యావసరాలు తెచ్చుకోవాలన్నా ఇక్కట్లు తప్పడం లేదు. శనివారం ఎడ్లబండిపై డీజే బాక్స్ తీసుకెళ్లారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలంటూ వాపోతున్నారు.

News October 13, 2024

ADB: ఎంబీబీఎస్‌లో సీటు.. విద్యార్థికి రూ.50 వేల సాయం

image

ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం మరపగూడకు చెందిన పూనం అశోక్ MBBSలో ర్యాంకు సాధించాడు. ఈ మేరకు ఆదిలాబాద్ ఎస్పీ గౌస్ ఆలం విద్యార్థిని శనివారం ఘనంగా సన్మానించారు. అనంతరం రూ.50వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాయిసెంటర్ జిల్లా మెస్రం దుర్గం, సర్పంచుల సంఘం మాజీ మండలాధ్యక్షుడు రూపాదేవ్, తదితరులు పాల్గొన్నారు.

News October 12, 2024

నిర్మల్: పండగపూట విషాదం

image

దిలావర్పూర్ మండలం సిర్గాపూర్ సమీపంలో జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అనంత్ పేట్‌కు చెందిన పోలీస్ బొర్రన్న (50)మృతి చెందాడు. దిలావర్పూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బొర్రన్న ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్రగాయాలైన అతణ్ని 108లో నిర్మల్ ఏరియా అస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడన్నారు.