News March 20, 2025
ఆదిలాబాద్: నియోజకవర్గానికి 3500 ఇళ్ల మోక్షం

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్లో సంక్షేమ రంగాలకు అధిక ప్రాధాన్యం కనిపిస్తోంది. ప్రభుత్వం అభయహస్తం కింద అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలకు నిధులు కేటాయించింది. దీంతో తొలి విడతలో చేపట్టనున్న నియోజకవర్గానికి 3500 చొప్పున ఇళ్ల నిర్మాణానికి మోక్షం లభించనుంది. ఉమ్మడి జిల్లాలో 35 వేల మందికి లబ్ది చేకూరనుంది. గృహజ్యోతి కింద 3.60లక్షల మందికి లాభం జరగనుంది. పింఛన్ల లబ్ధిదారుల సంఖ్య రెట్టింపు కానుంది.
Similar News
News March 26, 2025
ADB: వ్యక్తి హత్య.. నిందితుడికి యావజ్జీవ శిక్ష

హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష, రూ.1000 జరిమానా విధిస్తూ ఆదిలాబాద్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు బుధవారం తీర్పునిచ్చారు. 2022, ఆగస్టు 21న జైనథ్ మండలం రాంపూర్కు చెందిన కొడిమెల ప్రభాకర్ పాత కక్షల కారణంగా కుట్ల రమేశ్ను కత్తితో పొడిచి చంపాడు. అప్పటి జైనథ్ ఎస్ఐ పెర్సిస్, సీఐ నరేశ్ కుమార్ కేసు నమోదు చేశారు. 18 మంది కోర్టులో సాక్షులను ప్రవేశపెట్టగా విచారణలో నేరం రుజువైంది.
News March 26, 2025
వాటిని షెడ్యూల్ గ్రామాలుగా ప్రకటించాలి: MP నగేశ్

50% కంటే ఎక్కువ శాతం గిరిజనులు నివసిస్తున్న గ్రామాలను రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ గ్రామాలుగా ప్రకటించాలని ఆదిలాబాద్ MP నగేశ్ కోరారు. బుధవారం జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలన్నారు. దీంతో తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల గిరిజనులకు లాభం జరుగుతుందని పేర్కొన్నారు.
News March 26, 2025
ADB: ఆపదలో ఉంటే ఈ నంబర్కు కాల్ చేయండి

బాల్య వివాహాల నివారణకై ప్రతి ఒక్కరు కృషి చేయాలని DCPU సిబ్బంది ప్రేమ్ అన్నారు. బుధవారం పట్టణంలోని KRK కాలనీ మక్కా మసీద్లో షుర్ ఎన్జీవో ఆధ్వర్యంలో జిల్లా కోఆర్డినేటర్ వినోద్, ఫీల్డ్ సుపర్వైజర్ కిరణ్తో కలిసి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆడపిల్లల రక్షణ, సంరక్షణ కోసం ఒక వ్యవస్త పని చేస్తుందన్నారు. ఆపదలో ఉన్నవారు ఎవరికి భయపడకుండా డయల్ 100, 181,1098కి కాల్ చేయాలని సూచించారు.