News March 10, 2025

ఆదిలాబాద్, నిర్మల్‌కు మొండిచేయి

image

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌కు నిధులు మంజూరు చేస్తూ Dy.CM భట్టి విక్రమార్క ఉత్తర్వులు విడుదల చేశారు. సువిశాల స్థలంలో ఇంటర్నేషనల్ స్థాయి విద్యకు దీటుగా నిర్మిస్తున్నామని తెలిపారు. ఇక్కడి విద్యార్థులు ప్రపంచంతో పోటీపడుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆసిఫాబాద్‌కు రూ.200కోట్లు, మంచిర్యాలకు రూ.600 కోట్లు మంజూరుకాగా ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలకు ఎలాంటి కేటాయింపులు చేయలేదు.

Similar News

News November 24, 2025

అండర్ వరల్డ్‌ మాఫియాకు బెదరని ధర్మేంద్ర

image

బాలీవుడ్ చిత్ర పరిశ్రమ 1980, 90ల్లో అండర్ వరల్డ్ మాఫియా బెదిరింపులను విపరీతంగా ఎదుర్కొంది. భయంతో కొందరు నటులు సినిమాలను నిలిపివేయగా, మరికొందరు వారికి డబ్బులు ఇచ్చేవారు. అయితే <<18377596>>ధర్మేంద్ర<<>> మాత్రం వారికెప్పుడూ తలొగ్గలేదని డైరెక్టర్ సత్యజీత్ పూరి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఎవరైనా ఆయనను బెదిరింపులకు గురిచేస్తే పంజాబ్ నుంచి గ్రామస్థులు ట్రక్కుల్లో వస్తారని తిరిగి వార్నింగ్ ఇచ్చేవాడని గుర్తుచేశారు.

News November 24, 2025

HYD: ‘గ్రూప్-2’ సమస్యలపై పోరాటం ఆగదు!

image

TG గ్రూప్-2 నియామక సమస్యలపై పోరాటం ఆగదని నిరుద్యోగ JAC నాయకుడు ఇంద్రా నాయక్, పిటిషనర్లు బాలాజీ, సుజాత, మానస తేల్చిచెప్పారు. దీనిపై శాశ్వత పరిష్కారం కోరుతూ పిటీషనర్లు ప్రొ.కోదండరామ్‌ వద్దకు వెళ్లారు. దాదాపు పదేళ్లుగా నిలిచిపోయిన నోటిఫికేషన్‌‌పై ప్రభుత్వం తక్షణ నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇందులో ప్రదీప్ రెడ్డి పాల్గొన్నారు.

News November 24, 2025

మెదక్: ప్రజావాణిలో ప్రజల సమస్యలు విన్న ఎస్పీ

image

మెదక్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చారు. తమ సమస్యలు, వివాదాలు, పోలీసు సంబంధిత ఇబ్బందులను వారు నేరుగా జిల్లా ఎస్పీ శ్రీనివాసరావుకు విన్నవించారు. ఎస్పీ ప్రతి ఫిర్యాదు దారునితో వ్యక్తిగతంగా మాట్లాడి, సమస్యలపై పూర్తి వివరాలు తెలుసుకున్నారు. సమస్యలను పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.