News August 26, 2024
ఆదిలాబాద్: పంజా విసురుతున్న డెంగీ

ఉమ్మడి జిల్లాలో దగ్గు, జలుబు, ఫ్లూ, విష జ్వరాలకు తోడు డెంగీ చాపకింద నీరులా విస్తరిస్తోంది. ఇటీవల విస్తారంగా వర్షాలు కురవడంతో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పలు చోట్ల వర్షపు నీరు నిల్వ ఉండి దోమలకు ఆవాసంగా మారింది. నీటి నిల్వలు ఉండకుండా చూసుకుంటూ పరిసరాల పారిశుద్ధ్యం పాటించాలని వైద్య శాఖ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా అది పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. ఉమ్మడి జిల్లాలో 204 డెంగీ కేసులు నమోదయ్యాయి.
Similar News
News February 27, 2026
ఆదిలాబాద్: విద్యార్థినితో కలెక్టర్ చిట్ చాట్

విద్యార్థులు లెక్కలను కేవలం పరీక్షల కోసం కాకుండా, జీవిత నైపుణ్యాలుగా అభివృద్ధి చేసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. బాలక్ మందిర్ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులతో పాటు బల్లపై కలెక్టర్ కూర్చున్నారు. విద్యార్థినితో మాట్లాడి కాసేపు చిట్ చాట్ చేశారు. గణితం ఒక క్లిష్టమైన విషయం కాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ ఏఎంఓ లక్ష్మణ్, అసిస్టెంట్ ఏఎంఓ అజయ్ ఉన్నారు.
News February 27, 2026
ఆదిలాబాద్: వృత్తిపరమైన నైపుణ్యంతో పనిచేయాలి: అదనపు కలెక్టర్

క్షేత్రస్థాయిలో భూముల కొలతలు, రికార్డుల నమోదులో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త వహించాలని అదనపు కలెక్టర్ శ్యామలదేవి సూచించారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్నారు. భూ వివాదాల పరిష్కారంలో సర్వేయర్ల పాత్ర అత్యంత కీలకమని, నూతనంగా ఎంపికైన వారు వృత్తిపరమైన నైపుణ్యంతో పనిచేయాలని పేర్కొన్నారు. భూ సర్వే ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు, భూ రికార్డుల ప్రక్షాళనలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.
News February 27, 2026
ADB: సర్వేయర్లు ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించాలి: కలెక్టర్

ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమమైన ‘భూ భారతి’లో భాగంగా శిక్షణ పూర్తి చేసుకున్న సర్వేయర్లు ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. శుక్రవారం రెండో విడతలో శిక్షణ పొంది ఉత్తీర్ణులైన 65 మంది లైసెన్స్డ్ సర్వేయర్లకు ధ్రువపత్రాలను, లైసెన్స్లను అందజేశారు. క్షేత్రస్థాయిలో భూముల కొలతలు, రికార్డుల నమోదులో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త వహించాలని సూచించారు.


