News March 26, 2025
ఆదిలాబాద్: పరీక్షకు 24 మంది విద్యార్థులు గైర్హాజరు

ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. బుధవారం నిర్వహించిన పరీక్షకు మొత్తం 10,050 మంది విద్యార్థులకు గాను 10,026 మంది విద్యార్థులు హాజరుకాగా 24 మంది గైర్హాజరైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ప్రణీత వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 52 పరీక్ష కేంద్రాలకు గాను 28 పరీక్ష కేంద్రాలను అధికారులు సందర్శించారు.
Similar News
News April 2, 2025
ఉట్నూర్: అస్వస్థతతో ఉపాధి కూలీ మృతి

అస్వస్థతకు గురై ఉపాధి కూలీ మృతిచెందాడు. గ్రామస్థుల వివరాలు.. ఉట్నూర్ (M) అందోలికి చెందిన పారేకర్(34) 3 వారాలుగా ఉపాధి పనులకు వెళ్తున్నాడు. మంగళవారం మధ్యాహ్నం వరకు పని చేసి ఇంటికి చేరుకుని పడుకున్నాడు. కొద్దిసేపటికి అతడికి వాంతులు, విరోచనాలు, ఛాతిలో నొప్పి రావడంతో ఇంద్రవెల్లి ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి ADBకి తరలించే క్రమంలో మృతిచెందాడు. ఎండ తీవ్రతతో మరణించినట్లు అనుమానిస్తున్నారు.
News April 2, 2025
ADB కలెక్టర్కు అవార్డ్.. సిబ్బందికి సన్మానం

ఆదిలాబాద్ జిల్లాలో కలెక్టర్ రాజర్షిషా వైవిధ్య ఆలోచన రూపమైన ఆరోగ్య పాఠశాల ప్రత్యేక కార్యక్రమానికి ప్రతిష్ఠాత్మకమైన జాతీయ స్థాయి స్కోచ్ అవార్డ్ దక్కింది. ఈ సందర్భంగా ఆనందాన్ని వ్యక్తపరుస్తూ ఆరోగ్య పాఠశాల కార్యక్రమానికి అవార్డు వచ్చేలా పనిచేసిన బృందాన్ని కలెక్టర్ మంగళవారం సన్మానించారు. ఇదే ఉత్సాహంతో కార్యక్రమాన్ని వచ్చే విద్యా సంవత్సరంలోనూ పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ వారిని కోరారు.
News April 2, 2025
అసాంఘిక కార్యకలాపాలను అరికట్టాలి: ADB SP

డయల్ 100 సిబ్బంది వీలైనంత త్వరగా ఘటన స్థలాలకు చేరుకోవాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ అన్నారు. తమ పరిధిలో పెట్రోలింగ్, గస్తీ నిర్వహిస్తూ అసాంఘిక కార్యకలాపాలను అరికట్టాలన్నారు. బ్లూ కోర్ట్&డయల్ 100 సిబ్బంది, పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. అదేవిధంగా పాత నేరస్తులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలన్నారు. డయల్ 100కి ఫోన్ చేసే వారి సమాచారాన్ని గోప్యంగా ఉంచాలన్నారు.