News March 26, 2025

ఆదిలాబాద్: పరీక్షకు 24 మంది విద్యార్థులు గైర్హాజరు

image

ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. బుధవారం నిర్వహించిన పరీక్షకు మొత్తం 10,050 మంది విద్యార్థులకు గాను 10,026 మంది విద్యార్థులు హాజరుకాగా 24 మంది గైర్హాజరైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ప్రణీత వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 52 పరీక్ష కేంద్రాలకు గాను 28 పరీక్ష కేంద్రాలను అధికారులు సందర్శించారు.

Similar News

News April 19, 2025

ఇకపై భూ సమస్యలపై శాశ్వత పరిష్కారం: మంత్రి

image

ఎన్నికల వేల ప్రజలకు ఇచ్చిన హామీ మేరకే భూ భారతి చట్టాన్ని అమలు చేస్తున్నామని, ఇకపై భూ సమస్యలపై శాశ్వత పరిష్కారం లభించనుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. భూ భారతి చట్టంపై భోరజ్ మండలం పూసాయిలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో మంత్రి సీతక్కతో కలిసి ఆయన పాల్గొన్నారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన పంచాయతీ భవనాన్ని ఎంపీ గోడం నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్‌తో కలిసి ప్రారంభించారు.

News April 19, 2025

ADB: నేడు జొన్నల కొనుగోలు కేంద్రం ప్రారంభం

image

ప్రభుత్వ మద్దతు క్వింటాలకు రూ.3,371తో జొన్న కొనుగోలుకు మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రం ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. గుడిహత్నూర్ పీఏసీఎస్ఎ ద్వారా ఈనెల 19 నుంచి ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో కేంద్రాన్ని జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి సీతక్కతో పాటు ప్రజాప్రతినిధులు ప్రారంభిస్తారని పేర్కొన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News April 18, 2025

ధరణి బంగాళాఖాతంలో కలుపుతాం అంటేనే అధికారంలోకి: పొంగులేటి

image

BRS అమలు చేసిన ధరణిని బంగాళాఖాతంలో కలుపుతాం అన్నందుకే రైతులు కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. భోరజ్ మండలం పుసాయిలో శుక్రవారం జరిగిన భూ భారతి కార్యక్రమంలో మంత్రి సీతక్కతో కలిసి ఆయన పాల్గొన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ధరణి తొలగించి భూ భారతి తెచ్చామని పేర్కొన్నారు.

error: Content is protected !!