News March 5, 2025
ఆదిలాబాద్: పరీక్ష కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్

ఆదిలాబాద్ జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు పకడ్బందీగా కొసాగాయి. తొలి రోజు పరీక్ష ప్రశాంతంగా వాతావరణంలో ప్రారంభం అయ్యాయి. ఇందులో భాగంగానే విద్యార్థి కళాశాల, ప్రభుత్వ జూనియర్ బాలికల కళాశాలల్లో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియెట్ పరీక్ష కేంద్రాలను బుధవారం జిల్లా కలెక్టర్ రాజర్షి షా తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు శాతం, సీసీ కెమెరాలను పరిశీలించారు.
Similar News
News March 6, 2025
ADB: మందు తాగిన దంపతులు.. భర్త మృతి

నేరడిగొండ మండలంలో విషాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. వడూర్ గ్రామానికి చెందిన రైతు ఈదపు పోశెట్టి (60), అతడి భార్య ఇందిర(52) అప్పుల బాధ భరించలేక గురువారం పురుగు మందు తాగారు. ఈ ఘటనలో పోశెట్టి మృతి చెందగా ఇందిర పరిస్థితి విషమంగా ఉంది. పంట సాగులో నష్టం రావడం, ఇద్దరు పిల్లలకు పెళ్లి చేయడంతో అప్పులు అయ్యాయనే మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు.
News March 6, 2025
ఆదిలాబాద్: పరీక్ష కేంద్రంలో ఇంటర్ విద్యార్థికి అస్వస్థత

ఆదిలాబాద్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రంలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురయ్యాడు. గురువారం సెకండ్ ఇయర్ పరీక్ష జరుగుతున్న సమయంలో బాపురావు అనే విద్యార్థికి అకస్మాత్తుగా ఆస్తమా, బీపీ పెరగడంతో అస్వస్థతకు గురయ్యాడు. అక్కడే ఉన్న వైద్య సిబ్బంది ఆయనకు ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం 108 లో రిమ్స్ తరలించగా.. ప్రస్తుతం విద్యార్థి ఆరోగ్య పరిస్థితి మెరుగైంది.
News March 6, 2025
ADB: ఆ తల్లిదండ్రులకు తీరని శోకం

కూతురు పుట్టిందని మురిసిన ఆ తల్లిదండ్రులకు తీరని శోకం మిగిలింది.. అమ్మానాన్న అంటూ పిలిచిన గొంతు నేడు వినిపించడం లేదు.. అల్లారుముద్దుగా పెంచిన కూతురు కళ్ల ముందు చనిపోతుంటే ఆ తల్లిదండ్రులు పడిన బాధ వర్ణనాతీతం.ADB రూరల్(M) లోకారికి చెందిన మహేశ్, లావణ్య దంపతుల కూతురు మనీషా(3)కు రెండేళ్ల క్రితం గుండె సంబంధిత ఆపరేషన్ జరిగింది. ఇటీవల అనారోగ్యానికి గురవగా బుధవారం చికిత్స పొందుతూ చనిపోయింది.