News May 26, 2024
ఆదిలాబాద్: ప్రశాంతంగా JEE అడ్వాన్స్డ్ పరీక్ష

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని నలంద కళాశాలలో ఆదివారం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ ప్రవేశ పరీక్ష వాతావరణంలో ముగిసింది. ఉదయం 9 గంటల నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2.30 నిమిషాల నుంచి 5.30 వరకు రెండు సెషన్లలో పరీక్ష నిర్వహించారు. కాగా ఉదయం జరిగిన పరీక్షకు 96 మంది విద్యార్థులు ఉండగా 95 మంది విద్యార్థులు హాజరై ఒకరు గైర్హాజరయ్యారు. అలాగే మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 96మంది విద్యార్థులు ఉండగా ఒకరు గైర్హాజరయ్యారు.
Similar News
News November 25, 2025
ఆదిలాబాద్ జిల్లా రైతాంగానికి సూచన

సోయాబీన్, మొక్కజొన్న, జొన్న, పత్తి పంట అవశేషాల దహనం వల్ల గాలి కాలుష్యం, భూసార, జీవవైవిధ్య నష్టం, భూమిలోని ప్రయోజనకరమైన సూక్ష్మజీవులు నశించడం వంటి సమస్యలు ఏర్పడతాయని DAO శ్రీధర్ తెలిపారు. రైతులు వ్యవసాయ వ్యర్థాలను లేదా పంట అవశేషాలను కాల్చకుండా వాటిని కంపోస్ట్, వర్మీ కంపోస్ట్గా మార్చి లేదా భూమిలో కలియదున్నాలని, వ్యవసాయంలో సేంద్రియ ఎరువులుగా వినియోగించుకోవాలన్నారు. భూసారాన్ని సంరక్షించాలని అన్నారు
News November 25, 2025
ADB: ఏటీఎంలో చోరీకి యత్నించిన దొంగ అరెస్టు

ఆదిలాబాద్ కోర్టు ముందు ఉన్న ఎస్బీఐకి చెందిన రెండు ఏటీఎంలను ఒక వ్యక్తి ధ్వంసం చేసి చోరీకి యత్నించిన ఘటన చోటు చేసుకుంది. టూటౌన్ సీఐ నాగరాజు వివరాల ప్రకారం.. ఒక వ్యక్తి రాడ్తో ఏటీఎంలను ధ్వంసం చేశాడు. అలారం మోగగా పోలీసులు వెంటనే అప్రమత్తమై అక్కడకు చేరుకున్నారు. ఆగంతకుడు పారిపోగా పోలీసులు సీసీ ఫుటేజీని పరిశీలించి ఏపీ ప్రకాశం జిల్లా చెందిన చాట్ల ప్రవీణ్ చోరీకి యత్నించినట్లు గుర్తించి అరెస్టు చేశారు.
News November 24, 2025
ADB: రిజర్వేషన్ల ప్రక్రియ పునఃపరిశీలన

ఆదిలాబాద్ జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియను రాజ్యాంగ నిబంధనలు, రాష్ట్ర పంచాయతీ రాజ్ చట్టం, జనాభా ప్రాతిపదిక, బీసీ డిక్లరేషన్ కమిషన్ నివేదికలను పరిగణలోకి తీసుకొని పునఃపరిశీలించినట్టు ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల విషయంలో వారి జనాభాకన్నా తక్కువగా రిజర్వేషన్లు ఉండకూడదని, అదే సమయంలో మొత్తం రిజర్వేషన్లు 50 శాతాన్ని మించకూడదని స్పష్టం చేశారు.


