News May 10, 2024

ఆదిలాబాద్ : మీరు ఓటేశారా..? నేడే LAST మరీ..!

image

ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పోలీసులు, పాత్రికేయులకు కేంద్ర ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ ద్వారా కల్పించిన ఓటింగ్ సదుపాయం నేటితో ముగియనుందని అధికారులు తెలిపారు. ఈనెల 3నుంచి 8వరకు అవకాశం ఇవ్వగా మరో 2 రోజులు పోస్టల్ బ్యాలెట్ గడువును పొడిగించారు. రెండు రోజులు గడువు పొడిగించడంతో ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

Similar News

News February 16, 2025

నా పేరు మీద నకిలీ ఫేస్‌బుక్ ఖాతాలు: నిర్మల్ కలెక్టర్

image

నిర్మల్ జిల్లా కలెక్టర్ పేరుతో ఉన్న నకిలీ ఫేస్‌బుక్ ఖాతాలను నమ్మవద్దని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పేరుతో కొందరు నకిలీ ఫేస్బుక్ ఖాతాలను సృష్టించారని ఆమె పేర్కొన్నారు. ఆయా ఫేస్బుక్ ఖాతాలకు ఎట్టి పరిస్థితుల్లో స్పందించవద్దన్నారు. జిల్లా కలెక్టర్ పేరుతో, ఫొటోలతో ఉన్న ఫేస్ బుక్ ఖాతాలు నకిలీవని, ఇప్పటికే జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించామన్నారు.

News February 16, 2025

ADB: బాబా మాటలు నమ్మి మోసపోయిన వ్యక్తి

image

బాబా మాటలు నమ్మి ఒక వ్యక్తి మోసపోయిన ఘటన ADBలో జరిగింది. CI కరుణాకర్ కథనం ప్రకారం.. ఖుర్షీద్ నగర్‌కు చెందిన అజహర్ ఉద్దీన్‌కు మహారాష్ట్రకు చెందిన యాసీన్(జనబ్ డోంగీబాబా) పరిచయమయ్యాడు. ఆయన అజహర్‌కు మాయమాటలు చెప్పి తన వద్ద తాయత్తు తీసుకుంటే సమస్యలన్నీ తీరిపోతాయని నమ్మించాడు. అయితే తాయత్తు తీసుకున్న అనంతరం ఇంట్లో గొడవలు ప్రారంభం కావడంతో తనను బాబా మోసం చేశాడంటూ టూటౌన్ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.

News February 16, 2025

ఆదిలాబాద్: 8 గంటల నుంచి 4 వరకు పోలింగ్

image

ఈనెల 27న నిర్వహించే ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది వారికి కేటాయించిన పోలీంగ్ స్టేషన్ లను పరిశీలించాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు 220 మంది, జోనల్ ఆఫీసర్లు 9 మందిని కేటాయించడం జరిగిందని తెలిపారు. పోలింగ్ విధులు పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ఉదయం 8 నుంచి 4 గంటల వరకు పోలింగ్ ఉంటుందన్నారు.

error: Content is protected !!