News April 12, 2024

ఆదిలాబాద్: మురికి కాల్వలో పడి ఒకరి మృతి

image

ఆదిలాబాద్ పట్టణంలో ఓ మురికి కాల్వలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో సంఘ భవన సమీపంలోని శుక్రవారం మురికి కాల్వలో పడి చౌహన్ సంతోష్ అనే వ్యక్తి మృతి చెందాడు. అతను రోడ్లపై దొరికే సామగ్రిని విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నట్లు సమాచారం. అయితే మురికికాలువలో ప్రమాదవశాత్తు పడ్డాడా లేదా ఇంకా ఏమైనా కారణం ఉందా తెలియాల్సి ఉంది. ఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు.

Similar News

News March 15, 2025

ఆదిలాబాద్ జిల్లాలో కత్తి పోట్ల కలకలం

image

ఆదిలాబాద్ జిల్లా బోరాజ్ మండలం గూడ రాంపూర్‌లో శుక్రవారం రాత్రి కత్తిపోట్ల ఘటన కలకలం రేపింది. గ్రామంలో ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ చోటు చేసుకుంది. ఒక వ్యక్తిపై మరో వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ క్రమంలో అడ్డుకోబోయిన మరో వ్యక్తి కూడా కత్తి పోట్లకు గురయ్యాడు. ఇద్దరిని రిమ్స్‌కు తరలించారు. డీఎస్పీ జీవన్ రెడ్డి, సీఐ సాయినాథ్ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. తాగిన మత్తులో ఘర్షణ జరిగినట్లు సమాచారం.

News March 15, 2025

గ్రూప్‌-3లో బజార్హత్నూర్ వాసికి 74వ ర్యాంక్

image

గ్రూప్-3 ఫలితాలు శుక్రవారం విడుదల అయ్యాయి. ఇందులో బజార్హత్నూర్ మండలానికి చెందిన బిట్లింగ్ లక్ష్మమన్, నీల దంపతుల కుమారుడు ఉదయ్ కుమార్ 74వ ర్యాంక్ సాధించారు. ఇటీవల గ్రూప్‌-2 లో ఫలితాల్లో సైతం ఉదయ్ కుమార్ సత్తా చాటాడు. పోటీ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న ఆయనకు కుటుంబ సభ్యులతో పాటు మండల వాసులు అభినందనలు తెలిపారు.

News March 15, 2025

ADB: రేపే ఏకలవ్య పాఠశాల ప్రవేశ పరీక్ష

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 4 ప్రభుత్వ ఏకలవ్య ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతి కోసం ప్రవేశానికి ఈ నెల 16వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు RCO అగస్టీన్ అన్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఇంద్రవెల్లిలోని పాటగూడ, ఉట్నూర్, అసిఫాబాద్‌లోని సిర్పూర్(టి) EMRS పాఠశాలల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులు తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.

error: Content is protected !!