News June 24, 2024

ఆదిలాబాద్ : రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్‌కు దరఖాస్తు

image

ఇంటర్ సప్లీ ఫలితాలు విడుదలైన నేపథ్యంలో ఎవరికైనా సందేహాలు ఉంటే రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు ఈ నెల 29 వరకు దరఖాస్తు చేసుకోవాలని ఆదిలాబాద్ ఇంటర్ బోర్డ్ అధికారి రవీందర్ తెలిపారు. మొదటి సంవత్సరంలో జనరల్‌లో 3,313 మంది విద్యార్థుకు 2,212 మంది, ఒకేషనల్‌లో 128 మందికి 91 మంది ఉత్తీర్ణత సాధించారు. 2వ సంవత్సరం జనరల్‌లో 2,334 మందికి 1,479, ఓకేషనల్‌లో 235 మందికి 133 మంది ఉత్తీర్ణత సాధించారన్నారు.

Similar News

News February 27, 2026

ఆదిలాబాద్: విద్యార్థినితో కలెక్టర్ చిట్ చాట్

image

విద్యార్థులు లెక్కలను కేవలం పరీక్షల కోసం కాకుండా, జీవిత నైపుణ్యాలుగా అభివృద్ధి చేసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. బాలక్ మందిర్ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులతో పాటు బల్లపై కలెక్టర్ కూర్చున్నారు. విద్యార్థినితో మాట్లాడి కాసేపు చిట్ చాట్ చేశారు. గణితం ఒక క్లిష్టమైన విషయం కాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ ఏఎంఓ లక్ష్మణ్, అసిస్టెంట్ ఏఎంఓ అజయ్ ఉన్నారు.

News February 27, 2026

ఆదిలాబాద్: వృత్తిపరమైన నైపుణ్యంతో పనిచేయాలి: అదనపు కలెక్టర్

image

క్షేత్రస్థాయిలో భూముల కొలతలు, రికార్డుల నమోదులో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త వహించాలని అదనపు కలెక్టర్ శ్యామలదేవి సూచించారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్నారు. భూ వివాదాల పరిష్కారంలో సర్వేయర్ల పాత్ర అత్యంత కీలకమని, నూతనంగా ఎంపికైన వారు వృత్తిపరమైన నైపుణ్యంతో పనిచేయాలని పేర్కొన్నారు. భూ సర్వే ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు, భూ రికార్డుల ప్రక్షాళనలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.

News February 27, 2026

ADB: సర్వేయర్లు ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించాలి: కలెక్టర్

image

ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమమైన ‘భూ భారతి’లో భాగంగా శిక్షణ పూర్తి చేసుకున్న సర్వేయర్లు ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. శుక్రవారం రెండో విడతలో శిక్షణ పొంది ఉత్తీర్ణులైన 65 మంది లైసెన్స్‌డ్ సర్వేయర్లకు ధ్రువపత్రాలను, లైసెన్స్‌లను అందజేశారు. క్షేత్రస్థాయిలో భూముల కొలతలు, రికార్డుల నమోదులో ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్త వహించాలని సూచించారు.