News July 19, 2024
ఆదిలాబాద్ రైతుతో మాట్లాడిన CM రేవంత్ రెడ్డి

తాంసి మండలం బండల్ నాగపూర్ గ్రామంలోని రైతు వేదికలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మహేందర్ అనే రైతుతో CM రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఎన్ని ఎకరాలు ఉన్నాయని CM అడుగగా రైతు ఒక ఎకరం సగం ఉన్నదని బదులిచ్చారు. 50,000 లోన్ తీసుకున్నాను ఏకకాలంలో రుణమాఫీ అవడం చాలా సంతోషంగా ఉన్నదని రైతు తెలిపారు. మీ ఊరిలో అందరికీ చెప్పాలి మీ ఆదిలాబాద్ జిల్లాకి 120 కోట్లు ఇస్తున్నామని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.
Similar News
News February 6, 2025
ADB: నాగోబా ఆలయ హుండీ లెక్కింపు

కేస్లాపూర్లోని నాగోబా జాతర హుండీ లెక్కింపును గురువారం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో మెస్రం వంశీయులు, ఆలయ కమిటీ, రెవెన్యూ, దేవాదాయ, ఐటీడీఏ, పోలీస్ శాఖ అధికారుల సమక్షంలో హుండీ ఆదాయాన్ని లెక్కించారు. మొత్తం ఆదాయం రూ.21,08,511 వచ్చినట్లు దేవాదాయ శాఖ ఈవో రాజమౌళి తెలిపారు. పీఠాధిపతి వెంకట్రావ్ పటేల్, దేవాదాయశాఖ సీఎఫ్వో రవి, ఆలయ కమిటీ ఛైర్మన్ ఆనంద్ రావు తదితరులున్నారు.
News February 6, 2025
ఆదిలాబాద్: ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోండి

బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో RRB, SSC బ్యాంకింగ్ రిక్రూట్మెంట్ ఫౌండేషన్ కోర్సుల ఉచిత శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థులు ఈ నెల 9లోపు దరఖాస్తు చేసుకోవాలని ఆదిలాబాద్ బీసీ అభివృద్ధి అధికారి రాజలింగు, స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్ తెలిపారు. 4నెలల ఉచిత శిక్షణ, బుక్ ఫండ్, ప్రతినెల స్టైఫండ్ ఉంటుందన్నారు. ఆసక్తి గలవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News February 6, 2025
ఆదిలాబాద్: ‘వార్షిక పరీక్షలపై ఒత్తిడికి గురికావద్దు’

సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ ఆధ్వర్యంలో బీసీ స్టడీ సర్కిల్ ఆదిలాబాద్లో ఫ్రీ మెట్రిక్ వసతి గృహ పదో తరగతి విద్యార్థులకు ప్రేరణ తరగతుల కార్యక్రమాన్ని ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ రాజార్షి షా పాల్గొని ప్రారంభించారు. పదోతరగతి విద్యార్థులకు వార్షికపరీక్షలకు అవసరమైన సామగ్రిని కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు రాయాలని సూచించారు.