News April 24, 2024

ఆదిలాబాద్ లోక్‌సభకు పోటీలో తొలి మహిళ

image

ఆదిలాబాద్ లోక్‌సభ స్థానానికి మొదటిసారి ఓ మహిళ పోటీ చేయనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా ఆత్రం సుగుణ ఆ అవకాశాన్ని దక్కించుకున్నారు. 1952లో ఆదిలాబాద్ లోక్‌సభ స్థానం ఏర్పడింది. 2009లో ఎస్టీలకు రిజర్వ్ చేశారు. ఈసారి మొట్టమొదటి సారి ఆదిలాబాద్ నుంచి ఆత్రం సుగుణ పోటీ చేస్తున్నారు.

Similar News

News April 16, 2026

నిప్పుల కొలిమిలా ఆదిలాబాద్

image

జిల్లాలో భానుడు భగభగలాడుతున్నాడు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం జిల్లావ్యాప్తంగా ఎండ తీవ్రత స్థాయి పెరిగింది. తాంసీ, గుడిహత్నూర్‌లో అత్యధికంగా 42-44°C, ఇంద్రవెల్లి, ఉట్నూర్, గాదిగూడలో 41-43°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే సెగలు పుడుతుండటంతో జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

News April 16, 2026

ఆదిలాబాద్: మేలుకో మిత్రమా..!

image

అందని ఎత్తులు.. అర్థం కాని వేగం.. సరదాగా మొదలై విషాదంగా ముగిసే మైనర్ల డ్రైవింగ్‌పై ఆదిలాబాద్ గడ్డపై ‘ఖాకీ’ హెచ్చరిక గంట మోగింది. “మీ బిడ్డల చేతికి బైక్ తాళాలు ఇవ్వడం అంటే.. మృత్యుపాశాన్ని అందించడమే” అని పోలీసులు పేర్కొంటున్నారు. వారం రోజుల్లో 400 మంది చిన్నారులు స్టీరింగ్ పట్టి రోడ్ల మీదకు రావడం ఆందోళనకరం. అల్లారుముద్దుగా పెంచుకున్న ప్రాణాలు రోడ్డు ప్రమాదాల రక్తపు మడుగులో కలవకముందే.. మేలుకోండి.

News April 15, 2026

చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి: కలెక్టర్ రాజర్షి షా

image

జిల్లాలోని పట్టణాలు, గ్రామాలు, ప్రధాన కూడళ్ల వద్ద చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియలో స్వచ్ఛంద సంస్థలు, రెడ్‌క్రాస్‌ను భాగస్వామ్యం చేయాలని సూచించారు. చలివేంద్రాల్లో తాగునీటితో పాటు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు. ఎండల దృష్ట్యా ప్రజలు తగినంత నీరు తాగుతూ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలని ప్రకటనలో కోరారు.