News October 4, 2024
ఆదిలాబాద్: వెబ్ అప్షన్స్ పెట్టుకోవడానికి నేడే LAST

ఆదిలాబాద్ ప్రభుత్వ ఆర్ట్స్ కామర్స్ డిగ్రీ కళాశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి గాను పీజీ M.A ఎకనామిక్స్ M.Com రెగ్యులర్ కోర్సులలో రెండవ విడతలో వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి ఈనెల 4వ తేదీవరకు గడువు ఉందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అతీక్ బేగం కోఆర్డినేటర్ చంద్రకాంత్ తెలిపారు. CPGET రాసిన విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. ఇతర వివరాలకై కళాశాలను సంప్రదించాలని కోరారు.
Similar News
News January 6, 2026
ADB: 11 మంది టీజీఎస్పీ సిబ్బంది కన్వర్షన్

విధుల నిర్వహణను అంకితభావంతో, క్రమశిక్షణతో చేపట్టాలని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. టీజీఎస్పీ (తెలంగాణ స్పెషల్ పోలీస్) నుంచి వివిధ బెటాలియన్ల పరిధిలో విధులు నిర్వర్తించి ఆదిలాబాద్ జిల్లా సాయుధ విభాగానికి 11 మంది మంగళవారం బదిలీ అయ్యారు. విధులను సక్రమంగా నిర్వర్తించాలని ఎస్పీ సూచించారు. RI వెంకటి, సీసీ కొండరాజు పాల్గొన్నారు.
News January 6, 2026
ఆదిలాబాద్: రూ.50 పెరిగిన పత్తి ధర

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్లో మంగళవారం సీసీఐ పత్తి ధర క్వింటా రూ.8,010గా, ప్రైవేట్ పత్తి ధర రూ.7,400గా నిర్ణయించారు. సోమవారం ధరతో పోలిస్తే మంగళవారం సీసీఐ ధరలో ఎలాంటి మార్పు లేదని వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు. ప్రైవేట్ ధర రూ.50 పెరిగినట్లు వెల్లడించారు.
News January 6, 2026
ఆదిలాబాద్: విద్యుత్ వినియోగదారులకు టోల్ ఫ్రీ

విద్యుత్ వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించే క్రమంలో 1912 టోల్ ఫ్రీ సేవలను వినియోగించుకోవాలని ఆదిలాబాద్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజినీర్ శేషారావు పేర్కొన్నారు. 16 సర్కిళ్ల విద్యుత్ వినియోగదారులు ఈ టోల్ ఫ్రీ సేవలను సద్వినియోగ పరుచుకోవాలని పేర్కొన్నారు. 1912కు ఫోన్ చేయగానే ఫిర్యాదును స్వీకరించి, నమోదు చేసి సమాచారాన్ని సంబంధిత అధికారికి వెళ్తుందన్నారు.


