News July 30, 2024

ఆదిలాబాద్: సబ్మిషన్‌కు రేపే LAST

image

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో PG మొదటి, రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు అసైన్మెంట్ సబ్మిషన్ గడువు ఈనెల 31న ముగుస్తుందని ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ ప్రతాప్ సింగ్ పేర్కొన్నారు. ఉమ్మడి జిల్లా విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి తమ అసైన్మెంట్లు యూనివర్సిటీ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. అసైన్మెంట్లు పూర్తి చేసిన అనంతరం బుధవారంలోపు సబ్మిట్ చేయలని సూచించారు.

Similar News

News December 17, 2025

ఆదిలాబాద్ జిల్లాలో మొదటి విజయం మహిళదే

image

మూడో విడత స్థానిక ఎన్నికల్లో భాగంగా తలమడుగు మండల పరిధిలోని 22 గ్రామ పంచాయతీల్లో బుధవారం సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పల్లి-కే సర్పంచ్‌గా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి గుమ్ముల లక్ష్మి విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి తొడసం రుక్మా బాయిపై 39 ఓట్ల తేడాతో గెలుపొందారు. 29 గ్రామ పంచాయతీలు ఉండగా.. 7 ఏకగ్రీవం అయ్యాయి.

News December 17, 2025

బోథ్: అవ్వకు పోలీసు లాఠే చేతి కర్ర.. మానవత్వం చాటుకున్న SP

image

బోథ్ మండల నుంచి సొనాలకు వెళ్తున్న ఒక వృద్ధ మహిళ వాహనం నుంచి కిందపడి తలకు గాయమైంది. ఈ క్రమంలో అటుగా వెళుతున్న జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రత్యేక చొరవ తీసుకొని తన వాహనంలో ఉన్న ఫస్ట్ ఎయిడ్ కిట్ అందజేసి, వెంటనే సిబ్బంది సహకారంతో అవ్వకు ప్రథమ చికిత్స చేయించారు. తదుపరి నడవలేని స్థితిలో ఉన్న అవ్వకు పోలీసు లాఠీని అందజేశారు. వెంటనే బోథ్ PHCకి తరలించి మానవత్వం చాటుకున్నారు.

News December 17, 2025

ఆదిలాబాద్ జిల్లాలో 54.45 శాతం నమోదు

image

ఆదిలాబాద్ జిల్లాలో మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఉదయం 11 గంటల వరకు 54.45 శాతం సరాసరి ఓటింగ్ నమోదైందని జిల్లా పంచాయతీ అధికారి రమేశ్ తెలిపారు. బజార్హత్నూర్‌లో 53.57%, బోథ్ 47.73%, గుడిహత్నూర్ 58.11%, నేరడిగొండ 50.94%, సోనాల 55.56%, తలమడుగులో 61.19% నమోదైంది. ఓటర్లు చురుగ్గా పాల్గొంటున్నారు.