News April 13, 2025
ఆదిలాబాద్: 100వ పుట్టిన రోజు చేసుకున్న వృద్ధురాలు

ఓ వృద్ధురాలి వందేళ్ల పుట్టినరోజును ఆ కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఆదిలాబాద్లోని యాదవ సంఘ భవనంలో సరస్వతివార్ రుకుంబాయి 100వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కుమార్తెలు, కుమారులు, మనమళ్లు, మనుమరాళ్లతో కలిసి దాదాపు 100 మంది కుటుంబీకుల మధ్య కేక్ కట్ చేశారు.
Similar News
News December 13, 2025
NGKL: జిల్లాలో పెరిగిన చలి.. ఆరెంజ్ అలెర్ట్ జారీ..!

నాగర్కర్నూల్ జిల్లాలో గత వారం రోజులుగా చలితీవ్రత విపరీతంగా పెరుగుతుంది. గడిచిన 24 గంటలో అత్యల్పంగా బల్మూర్ మండలంలో 9.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అమ్రాబాద్, కల్వకుర్తి మండలలో 9.8, తెలకపల్లి మండలంలో 10.1, పదర మండలంలో 10.4, లింగాల మండలంలో 10.7, తాడూర్ 10.9 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో బల్మూరు, అమ్రాబాద్, కల్వకుర్తి మండలాల్లో ఆరంజ్ అలెర్ట్ జారీ చేయడం జరిగింది.
News December 13, 2025
HYD: ప్రముఖుల బసకు చిరునామా.. ఫలక్నుమా

ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ ఈరోజు ఉప్పల్ స్టేడియంలో జరిగే ఫుట్ బాల్ మ్యాచ్లో పాల్గొననున్నారు. దీని కోసం హైదరాబాద్కు వచ్చిన మెస్సీకి ప్రభుత్వం ఫలక్నుమా ప్యాలెస్లో బస ఏర్పాటు చేసింది. ఫలక్నుమా ప్యాలెస్ ప్రముఖులు బస చేసేందకు చిరునామాగా మారింది. దీన్ని 1893లో నిర్మించగా.. 1895 నుంచి ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గెస్ట్ హౌస్గా వాడేవారు. ప్రస్తుతం తాజ్ గ్రూప్ ప్యాలెస్ను లీజ్ తీసుకుంది.
News December 13, 2025
ప్రతాప్ గౌడ్ మృతి పార్టీకి తీరని లోటు: ఎమ్మెల్యే బండ్ల

మాజీ ఎంపీపీ ప్రతాప్ గౌడ్ మృతి పార్టీకి తీరని లోటు అని ఆయన సేవలు మరువలేనివి అని ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి అన్నారు. ప్రతాప్ గౌడ్ శుక్రవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. శనివారం అనంతపురం గ్రామంలోని ఎమ్మెల్యే వారి స్వగృహం చేరుకుని ఆయన పార్థివదేహానికి పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని మనస్ఫూర్తిగా ప్రార్థించారు.


