News February 28, 2025
ఆదిలాబాద్: 2019లో 59.03%.. 2025లో 70.42%

ఉమ్మడి ADB, NZB, KNR, MDK పట్టభద్రులు, ఉపాధ్యాయ MLC ఎన్నికల పోలింగ్ నిన్న జరగగా.. మార్చి 3న కరీంనగర్లో లెక్కింపు జరగనుంది. అయితే, 2019లో పట్టభద్రుల పోలింగ్ 59.03శాతం నమోదు కాగా, 2025లో 70.42 శాతం నమోదైంది. ఉపాధ్యాయ పోలింగ్ 2019లో 83.54శాతం నమోదు కాగా, 2025లో 91.90శాతం పోలింగ్ జరిగింది. 2019 ఎన్నికలతో పోలిస్తే పట్టభద్రుల పోలింగ్ 11.39శాతం, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ 8.36 శాతం పెరిగింది.
Similar News
News December 4, 2025
కాళోజీ యూనివర్సిటీ ప్రక్షాళన ఎప్పుడో?

వరంగల్: కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో వీసీ రాజీనామాతో సరిపెడుతున్నారనే చర్చ మొదలైంది. పరీక్ష పేపర్ల వ్యవహారంలో కీలకమైన ఎగ్జామినేషన్ కంట్రోలర్ పదేళ్లుగా ఒకరే ఉండడం అనుమానాలకు తావిస్తోంది. సంబంధం లేని వ్యక్తికి ఈ విభాగాన్ని ఎలా కేటాయిస్తారని ప్రభుత్వ వైద్యులు ప్రశ్నిస్తున్నారు. ఏళ్లుగా తిష్ట వేసిన వారి పాత్ర వెనుక ఉందని, వారిపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
News December 4, 2025
BNGR: 10 పంచాయతీలు ఏకగ్రీవం

పంచాయతీ తొలివిడత ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల లెక్కతేలింది. బుధవారం నామినేషన్ల ఉపసంహరణ అనంతరం అధికారులు పోటీలో ఉన్న అభ్యర్థులను ప్రకటించి.. గుర్తులు కేటాయించారు. భువనగిరి రెవెన్యూ డివిజన్ పరిధిలోని 6 మండలాల్లోని 153 గ్రామాల్లో మొదటి విడత ఎన్నికలు జరుగుతుండగా.. వీటిలో 10 గ్రామాల్లో సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బరిలో ఉన్న అభ్యర్థులకు ఈనెల 11న ఎన్నికలు జరగనున్నాయి.
News December 4, 2025
డ్రై స్కిన్ కోసం మేకప్ టిప్స్

పొడి చర్మం ఉన్నవారు మేకప్ వేసుకోవాలనుకుంటే ముందుగా సీరం అప్లై చేయాలి. మాయిశ్చరైజర్ కచ్చితంగా అవసరం. చర్మం పొడిగా, డీహైడ్రేటెడ్గా ఉంటే.. హైడ్రేటింగ్ ప్రైమర్ను ఎంచుకోవాలి. ఇది మీ మేకప్ లుక్ని హైడ్రేటింగ్ బేస్గా ఉపయోగించవచ్చు. పొడి చర్మం కోసం ఫౌండేషన్ ఎంచుకునేటప్పుడు హైడ్రేటింగ్, తేలికైన, మెరిసే లిక్విడ్ ఫౌండేషన్ను ఎంచుకోవాలి. ఫౌండేషన్ పైన క్రీమ్ బ్లష్, హైలైటర్లను ఉపయోగించాలి.


