News February 28, 2025
ఆదిలాబాద్: 2019లో 59.03%.. 2025లో 70.42%

ఉమ్మడి ADB, NZB, KNR, MDK పట్టభద్రులు, ఉపాధ్యాయ MLC ఎన్నికల పోలింగ్ నిన్న జరగగా.. మార్చి 3న కరీంనగర్లో లెక్కింపు జరగనుంది. అయితే, 2019లో పట్టభద్రుల పోలింగ్ 59.03శాతం నమోదు కాగా, 2025లో 70.42 శాతం నమోదైంది. ఉపాధ్యాయ పోలింగ్ 2019లో 83.54శాతం నమోదు కాగా, 2025లో 91.90శాతం పోలింగ్ జరిగింది. 2019 ఎన్నికలతో పోలిస్తే పట్టభద్రుల పోలింగ్ 11.39శాతం, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్ 8.36 శాతం పెరిగింది.
Similar News
News December 9, 2025
హీరో రాజశేఖర్కు గాయాలు

హీరో రాజశేఖర్ కొత్త సినిమా షూటింగ్లో గాయపడిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల 25న మేడ్చల్ సమీపంలో యాక్షన్ సీక్వెన్స్ చేస్తుండగా ఆయన కుడి కాలి మడమ వద్ద గాయమైంది. దీంతో వెంటనే ఆస్పత్రికి తరలించగా 3గంటల పాటు మేజర్ సర్జరీ చేసినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. శస్త్రచికిత్స సక్సెస్ అయిందని, 4 వారాలు విశ్రాంతి తర్వాత ఆయన మళ్లీ మూవీ షూటింగ్లో పాల్గొంటారని చెప్పాయి.
News December 9, 2025
మద్యం షాపులు బంద్: జనగామ కలెక్టర్

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రజా శాంతి భద్రతల కోసం మద్యం షాపులు, బార్లు, కల్లు దుకాణాలను తాత్కాలికంగా మూసివేయాలని జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ పూర్తయ్యే వరకు మూడు ఫేజ్ల్లో మండలాల వారీగా మూసివేత అమలు కానుందన్నారు. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘన కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
News December 9, 2025
భద్రాద్రి: ప్రేమ పేరుతో మోసం.. యువకుడికి జైలు శిక్ష!

ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి, వేరొక యువతిని వివాహం చేసుకున్న కేసులో నిందితుడు పొట్ట కృష్ణార్జున రావుకు దమ్మపేట జ్యుడీషియల్ కోర్టు రెండున్నరేళ్ల సాధారణ జైలు శిక్ష విధించింది. ఎస్ఐ యాయతి రాజు తెలిపిన వివరాలు.. అశ్వారావుపేట మం. బండారిగుంపు గ్రామానికి చెందిన యువతి ఫిర్యాదు మేరకు 2017లో కేసు నమోదైంది. ఈ కేసులో విచారణ అనంతరం మెజిస్ట్రేట్ భవాని రాణి తీర్పు వెల్లడించినట్లు తెలిపారు.


