News July 22, 2024
ఆదిలాబాద్: 26 నుంచి KU పరిధిలో పరీక్షలు

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఇంజినీరింగ్ బీటెక్ రెండో, మూడో సెమిస్టర్ పరీక్షలు జులై 26 నుంచి నిర్వహిస్తామని కేయూ పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ శ్రీరామోజు నరసింహాచారి తెలిపారు. జులై 26, 30, ఆగస్టు 1,3,5 తేదీలలో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. 2, 3 సెమిస్టర్లకు చెందిన రెగ్యులర్, సప్లిమెంటరీ, ఇంప్రూవ్మెంట్ అభ్యర్థులు హాజరు కావాలని తెలిపారు.
Similar News
News December 6, 2025
ఆదిలాబాద్: మహిళల్లో ఆత్మవిశ్వాసం పెరగాలి: కలెక్టర్

ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ధైర్యంగా ఎదుర్కొనే ఆత్మవిశ్వాసం మహిళల్లో పెరగాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మహిళలపై హింసకు వ్యతిరేకంగా అంతర్జాతీయ ప్రచారోద్యమం నేపథ్యంలో, ఆదిలాబాద్లోని న్యూ అంబేద్కర్ భవన్లో సఖి కేంద్రం, జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. మహిళలపై హింస నిర్మూలనకు సమాజమంతా ముందుకు రావాల్సిన అవసరం ఉందని కలెక్టర్ పేర్కొన్నారు.
News December 6, 2025
ADB: ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎంసీసీ కొనసాగుతుంది: కలెక్టర్

ఆదిలాబాద్ జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు దశల్లో జరుగుతున్నందున, చివరి దశ ఎన్నికలు పూర్తయ్యే వరకూ జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) అమల్లో ఉంటుందని కలెక్టర్ రాజర్షి షా స్పష్టం చేశారు. విజయోత్సవ ర్యాలీలు, పబ్లిక్ మీటింగులు, ప్రకటనలు, అభివృద్ధి హామీలు వంటి చర్యలను తక్షణమే నిరోధించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ఎన్నికైన సభ్యులకు ఈ విషయం తెలియజేయాలని సూచించారు.
News December 4, 2025
ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి: డిజిపి

గ్రామపంచాయతీ ఎన్నికలను నిస్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని డిజిపి శివధర్ రెడ్డి సూచించారు. గురువారం ఆదిలాబాద్లో ఉమ్మడి జిల్లాల ఎస్పీలతో సమావేశం నిర్వహించారు. గ్రామాలను సందర్శిస్తూ ప్రజలకు ఎన్నికలపై అవగాహన కల్పించాలన్నారు. క్రిటికల్ పోలింగ్ కేంద్రాల్లో బందోబస్తు పటిష్ఠంగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. శాంతి భద్రతల, మతపరమైన సమస్యల తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు.


