News May 11, 2024
ఆదిలాబాద్: 3రోజులు జొన్నల కొనుగోలు నిలిపివేత

ఆదిలాబాద్ జిల్లాలో వాతావరణ పరిస్థితిలో దృష్ట్యా జొన్నల కొనుగోలు జిల్లా వ్యాప్తంగా ఈనెల 11 తేదీ నుంచి 13వ తేదీ వరకు తాత్కలికంగా కొనుగోలు నిలిపివేయడం జరుగుతుందని మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 14 నుంచి తిరిగి యధావిధిగా కొనుగోలు పునర్ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని జిల్లా రైతులు గమనించి సహకరించాలని కోరారు.
Similar News
News April 11, 2026
ADB: కారుణ్య నియామకాల్లో 16 మందికి ఉత్తర్వులు

జిల్లాలో కారుణ్య నియామకాల కింద వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులకు ఎంపికైన 16 మంది అభ్యర్థులకు ఉత్తర్వులను జిల్లా కలెక్టర్ రాజర్షిషా శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో నియామక ఉత్తర్వులను అందజేశారు. 10 రెవెన్యూ , 2 సేల్స్ టాక్స్, 1 వెల్ఫేర్, 1 వైద్య శాఖ, 1 అకౌంట్స్, 1 ఇరిగేషన్ శాఖలకు కేటాయించారు.మొత్తం 15 జూనియర్ అసిస్టెంట్, ఒక ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు పత్రాలిచ్చారు.
News April 11, 2026
ADB: కొత్త ‘మీసేవ’లకు దరఖాస్తుల ఆహ్వానం

ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ మండలాలు, గ్రామాల్లో పౌర సేవలను విస్తరించేందుకు ప్రభుత్వం కొత్త మీసేవ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ ఈ దరఖాస్తులను పరిశీలించి అర్హులకు ఫ్రాంచైజీలు కేటాయించనుంది. ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశం.
News April 10, 2026
ADB: ఈవీఎం గోదామును పరిశీలించిన కలెక్టర్

ADB జిల్లా కేంద్రంలోని శాంతినగర్లోని ఈవీఎం భద్రతా కేంద్రాన్ని (గోదాం) జిల్లా కలెక్టర్ రాజర్షి షా శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రతి నెలా నిర్వహించే సాధారణ తనిఖీల్లో భాగంగా ఆయన ఈ సందర్శన చేపట్టారు. ఈ సందర్భంగా గోదాం వద్ద ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరును కలెక్టర్ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. రిజిస్టర్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.


