News June 4, 2024

ఆదిలాబాద్: 8 గంటలకు షురూ..3 గంటలకు పూర్తి..!

image

ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్, ఈవీఎంల ఓట్ల లెక్కింపు ఉదయం 8.00 గంటల నుంచి ప్రారంభం కానుంది. దీనికి వేరువేరుగా టేబుల్స్ ఏర్పాటు చేశారు. అసెంబ్లీ స్థానాల వారిగా పోలైన ఓట్లు, మొత్తం పోలింగ్ బూత్ ల ఆధారంగా లెక్కింపుకు టేబుళ్లను సిద్ధం చేశారు. ఉదయం 8 ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కాగా పూర్తిస్థాయి ఫలితాల వెల్లడికి మధ్యాహ్నం 3 గంటలకు వచ్చే అవకాశముంది.

Similar News

News November 27, 2025

ఎన్నికలను విజయవంతం చేయడం అందరి బాధ్యత: ADB కలెక్టర్

image

జిల్లాలో జరగనున్న పంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు తీసుకుంటున్న ఏర్పాట్లపై రాజకీయ పార్టీలతో సమన్వయం కొనసాగుతుందని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. రాజకీయ పార్టీ నేతలతో గురువారం సమీక్ష నిర్వహించారు. ప్రజాస్వామ్య పండుగలా జరిగే ఈ ఎన్నికలను విజయవంతం చేయడం అందరి బాధ్యత అన్నారు. నామినేషన్ల నుంచి లెక్కింపు వరకు ప్రతి దశలో పారదర్శక విధానాలు అమలు చేస్తామని స్పష్టం చేశారు.

News November 27, 2025

ఆదిలాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలకు సై..!

image

ఆదిలాబాద్ జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో ఎన్నికల సందడి నెలకొంది. నేటి (గురువారం) నుంచి తొలి విడత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. జిల్లాలో మొత్తం 467 గ్రామ పంచాయతీలు, 3,822 వార్డులు ఉన్నాయి. నామినేషన్ల ప్రక్రియ శనివారం వరకు కొనసాగుతుంది. ఈ నెల 30న నామినేషన్లను పరిశీలించి, అర్హత జాబితాను అధికారులు వెల్లడిస్తారు. బరిలో నిలిచేందుకు అభ్యర్థులు సిద్ధమవుతున్నారు.

News November 27, 2025

ఆదిలాబాద్‌లో బాల్య వివాహం అడ్డగింత

image

మావల పోలీసు స్టేషన్ పరిధిలోని ఒక కాలనీలో బాల్య వివాహాన్ని అధికారులు బుధవారం అడ్డుకున్నారు. 16 ఏళ్ల బాలికకు మరొ కాలనీకి చెందిన 26 ఏళ్ల ఓ యువకుడితో పెళ్లి చేసేందుకు ఇరు కుటుంబాలు నిర్ణయించుకున్నారు. చైల్డ్ హెల్ప్ లైన్‌కు సమాచారం రావడంతో పెళ్లిని నిలిపివేసినట్లు చైల్డ్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ సతీష్ కుమార్, మావల ఎఎస్ఐ అంబాజి తెలిపారు. అనంతరం ఇరు కుటుంబీకులకు, అమ్మాయికి కౌన్సిలంగ్ ఇచ్చామన్నారు.