News March 2, 2025

ఆదిలాబాద్ AIRPORT కలగానే మిగిలిపోతుందా..?

image

ఆదిలాబాద్‌లో AIRPORT కలగానే మిగిలిపోతోంది. రెండు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం వరంగల్ AIRPORTకు అనుమతులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. కాగా జిల్లాలో కూడా ఎయిర్ పోర్టు నిర్మాణానికి త్వరగా అడుగులు పడేలా చర్యలు తీసుకోవాలని జిల్లావాసులు కోరుతున్నారు. AIRPORT నిర్మాణానికి స్థలం ఉన్నప్పటికీ దానికి సంబంధించిన పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వలు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Similar News

News November 21, 2025

రాజీనామా యోచనలో కడియం..?

image

వరంగల్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. జూబ్లీహిల్స్ గెలుపు ఊపులో ఉన్న కాంగ్రెస్.. ఫిరాయింపుల విషయంలో రాజీనామా చేయించాలని చూస్తోంది. స్టే.ఘనపూర్ MLAగా ఉన్న కడియం శ్రీహరితో రాజీనామా చేయించి, ఎన్నికలకు వెళ్లి BRSను ఇరుకున పెట్టడానికి CM రేవంత్ స్కెచ్ వేస్తున్నట్లు సమాచారం. ఇదే వేడిలో ఉపఎన్నిక వస్తే కాంగ్రెస్‌కు గ్రౌండ్‌లో మరింత బలం పెరుగుతుందని భావిస్తున్నారు. 2 రోజుల్లో కడియం రాజీనామా చేసే అవకాశముంది.

News November 21, 2025

1956లో ప్రస్థానం ప్రారంభం.. నేటికి JNTUకి 60 ఏళ్లు

image

జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల డైమండ్ జూబ్లీ వేడుకలకు ముస్తాబైంది. 1965లో నాగార్జున ఇంజినీరింగ్ కళాశాలగా ఆవిర్భవించి 1972లో జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌గా అవతరించింది. 2015లో గోల్డెన్ జూబ్లీ వేడుకలు నిర్వహించుకొని నేడు డైమండ్ జూబ్లీ వేడుకలకు యూనివర్సిటీ కళాశాల సిద్ధమైంది. ఈ 60 ఏళ్లలో ఎన్నో ఘనతలు సాధించి ఎంతోమంది విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చింది.

News November 21, 2025

నల్గొండ: లంచగొండి అధికారులు.. 11 నెలల్లో 15 కేసులు

image

ఉమ్మడి నల్గొండ జిల్లాలో అవినీతికి పాల్పడుతున్న లంచగొండి ప్రభుత్వ అధికారులను ఏసీబీ వలపన్ని పట్టుకుంటూ దడ పుట్టిస్తోంది. నెలనెల లక్షల్లో జీతాలు తీసుకుంటూ కూడా కొందరు అధికారులు అత్యాశకు పోయి, ప్రతీ పనికి ధర నిర్ణయించి డబ్బులు దండుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది 11 నెలల్లోనే ఉమ్మడి జిల్లాలో సుమారు 15 ఏసీబీ కేసులు నమోదవడం గమనార్హం.