News October 14, 2024

ఆదిలాబాద్ MP నేటి పర్యటన ఇలా..

image

ఆదిలాబాద్ ఎంపీ గొడం నగేష్ నేడు (సోమవారం) సిర్పూర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. వివరాలు ఇలా.. కాగజ్‌నగర్ పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న అలాయ్- బలాయ్ కార్యక్రమంలో పాల్గొంటారు. 11 గంటలకు దహెగాం ప్రెస్‌క్లబ్ మొదటి వార్షికోత్సవానికి హాజరవుతారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు బెజ్జూర్ మండల కేంద్రంలో, 4 గంటలకు ఈస్గాంలో బీజేపీ సభ్యత్వ నమోదుపై కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు.

Similar News

News December 11, 2025

నార్నూర్: డబ్బులు పంచుతూ దొరికిన అభ్యర్థి భర్త

image

సర్పంచ్ అభ్యర్థి భర్తపై కేసు నమోదు చేసిన ఘటన నార్నూర్‌లో చోటుచేసుకుంది. ఎఫ్ఎస్‌టీ టీమ్ ఇన్‌ఛార్జ్ సొరాజి వివరాల ప్రకారం.. ఈనెల 10న మండల కేంద్రంలోని ముస్లిం వాడలో ఓ వ్యక్తి ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లకు డబ్బులు పంచుతున్నాడనే సమాచారంతో ఆకస్మికంగా తనిఖీ చేశారు. విజయనగర్ కాలనీకి చెందిన సర్పంచ్ అభ్యర్థి భర్త ఆడే సురేశ్ వద్ద నుంచి రూ.10వేలు స్వాధీనం చేసి కేసు నమోదు చేశామని వెల్లడించారు.

News December 11, 2025

ఆదిలాబాద్‌ జిల్లాలో 40.37% పోలింగ్ నమోదు

image

ఆదిలాబాద్ జిల్లాలో తొలి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఉదయం 11 గంటల వరకు 40.37 శాతం పోలింగ్ నమోదైందని జిల్లా పంచాయతీ అధికారి రమేశ్ తెలిపారు. మండలాల వారీగా పోలింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి. ఇచ్చోడలో 35.61%, సిరికొండ 60.21%, ఇంద్రవెల్లి 33.14%, ఉట్నూర్ 38.59%, నార్నూర్ 45.11%, గాదిగూడలో 53.77% నమోదైంది. ఓటర్లు చురుగ్గా పాల్గొంటున్నారు.

News December 11, 2025

నిబంధనలు పాటించకుంటే కేసు నమోదు: ఎస్పీ కాజల్ సింగ్

image

ఆదిలాబాద్ జిల్లాలో ఆరు మండలాల్లో జరుగుతున్న మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలో నిర్వహించరాదని అదనపు ఎస్పీ కాజల్ సింగ్ తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ర్యాలీలను నిర్వహించిన వారిపై కేసులను నమోదు చేయబడతాయని హెచ్చరించారు. సంబరాల పేరుతో టపాసులు కాల్చవద్దన్నారు. 936 మంది సిబ్బందితో పోలీస్ యంత్రాంగం ప్రతిష్ఠమైన బందోబస్తు చర్యలను చేపట్టిందని తెలిపారు.