News August 4, 2024

ఆదిలాబాద్ : REPORT చేయడానికి రేపే LAST

image

ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలో రెండో విడత ప్రవేశాలకు సంబంధించి రిపోర్టింగ్ గడువును పొడిగించినట్లు ఆదిలాబాద్ ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ శ్రీనివాస్ ఓ ప్రకటనలో తెలిపారు. ఐటీఐ రెండో విడతలో ప్రవేశాలు పొంది, ఇప్పటివరకు రిపోర్ట్ చేయని విద్యార్థులకు అడ్మిషన్ రిపోర్టింగ్ తేదీని ఆగస్టు 5వరకు పొడిగించినట్లు తెలిపారు. రెండో విడతలో సీటు పొందిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Similar News

News November 28, 2025

ఆదిలాబాద్: ఉద్యోగం పేరుతో మోసం

image

సింగరేణి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని బాలేరావ్ గౌతం అనే వ్యక్తి వద్ద నుంచి రెండు లక్షలు వసూలు చేసిన మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ జవాడే అనే వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు టూ టౌన్ సీఐ నాగరాజు తెలిపారు. నిరుద్యోగులు మధ్యవర్తుల మాటలు విశ్వసించవద్దని సూచించారు. మోసపోయినట్లయితే జిల్లా పోలీసులను సంప్రదించాలని సీఐ కోరారు.

News November 27, 2025

ఓపెన్ డ్రింకింగ్ జరగకుండా అరికట్టాలి: ADB SP

image

బేసిక్ పోలీసింగ్, విజిబుల్ పోలీసింగ్ ప్రతి ఒక్కరు నిర్వహించాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ సిబ్బందికి సూచించారు. గురువారం నిర్వహించిన నెలవారి నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాలలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయాలని, ఓపెన్ డ్రింకింగ్ జరగకుండా అరికట్టాలన్నారు. పట్టణంలో బీట్ సిస్టం సక్రమంగా అమలు చేయాలని, దీని ద్వారా నేరాల నియంత్రణ దొంగతనాల నివారణ సాధ్యమవుతుందని వివరించారు.

News November 27, 2025

ఎన్నికలకు అవసరమైన బందోబస్తు సిద్ధం: ADB SP

image

ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అవసరమైన భద్రతా బందోబస్తు ఇప్పటికే సిద్ధం చేస్తున్నామని SP అఖిల్ మహాజన్ తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి చర్యలు తీసుకునేలా పోలీసు విభాగం సన్నద్ధమైందన్నారు. శాంతియుత ఎన్నికల నిర్వహణకు ప్రతి ఒక్కరి సహకారం అవసరమని తెలిపారు. ప్రజలు రూ.50వేల కంటే ఎక్కువ నగదు తీసుకువెళ్తే తప్పనిసరిగా రసీదులు, డాక్యుమెంట్లు ఉండాలని సూచించారు.