News January 18, 2026

ఆదివారం.. అమావాస్య.. మేడారం!

image

అసలే చొల్లంగి అమావాస్య ఆదివారం కావడం, రాష్ట్ర సర్కార్ క్యాబినెట్ సమావేశం మేడారంలో నిర్వహించడం వెనుక మతలబేంటి అని చర్చ జరుగుతోంది. ఈరోజు తనపై ఎవరైనా నరదృష్టి చేసినా, తమపై ఉన్న నెగిటివ్ ఎనర్జీని పొగొట్టుకొవడానికి నాలుగు బాటల దగ్గర నిమ్మకాయ, గుడ్డును దాటుడు కోసం వేస్తారు. ఇలాంటి రోజు అడవిలో మంత్రుల సమావేశం నిర్వహించడంపై గుసగుసలు వినిపిస్తున్నాయి.

Similar News

News February 14, 2026

10నెలల పసికందు ఐదుగురికి ప్రాణం పోసింది

image

కేరళలో రోడ్డుప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన పది నెలల పసికందు అలిన్ షెరిన్ ఐదుగురికి ప్రాణం పోసింది. ఈ నెల 5న జరిగిన ప్రమాదంలో చిన్నారికి తీవ్రగాయాలయ్యాయి. ఆసుపత్రిలో చేరగా నిన్న బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు తెలిపారు. వారి విజ్ఞప్తితో చిన్నారి తల్లిదండ్రులు అవయవదానానికి అంగీకరించారు. క్లిష్ట సమయంలోనూ పేరెంట్స్ నిర్ణయాన్ని కేరళ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్, ఎంపీ రాజీవ్ చంద్రశేఖర్ ప్రశంసించారు.

News February 14, 2026

సిద్దిపేట: జాగ్రత్త.. బుట్టలో వేసి.. లక్షలు దోచేస్తున్నారు!

image

మ్యాట్రిమోనియల్ సైట్లు, సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిద్దిపేట సైబర్ క్రైమ్ డీఎస్పీ శ్రీనివాసు హెచ్చరించారు. ప్రధానంగా NRI, పెద్ద వ్యాపారవేత్తలమని నకిలీ ప్రొఫైల్స్ సృష్టించి, పెళ్లి చేసుకుంటామని నమ్మిస్తున్నారని తెలిపారు. పరిచయం పెంచుకున్నాక అత్యవసరాలు, స్టాక్స్, ట్రేడింగ్‌లో భారీ లాభాలంటూ పెట్టుబడుల పేరుతో అందినకాడికి దోచుకుంటున్నారని వివరించారు.

News February 14, 2026

రావులపాలెంలో యాక్సిడెంట్..ఒకరు స్పాట్ డెడ్

image

రావులపాలెం సమీపాన అమలాపురం రోడ్డులో బెంగళూరు అయ్యంగార్ బేకరీ వద్ద శుక్రవారం సాయంత్రం యాక్సిడెంట్ జరిగింది. బైక్‌పై వెళ్తున్న ఇద్దరి వ్యక్తులను వెనక వస్తున్న ట్రాలీ లారీ ఢీకొంది. చోదకుడు అనిల్ రెడ్డి(19) ఘటన స్థలంలోనే మృతి చెందగా..బైక్‌పై కూర్చున్న లోకేశ్వర సూర్య రాజు స్వల్పగాయాలతో బయటపడ్డాడు. సూర్య ఫిర్యాదు మేరకు ASI శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సీఐ శేఖర్ బాబు తెలిపారు.