News October 17, 2024
ఆదివాసీలకు, అనాథలకు సహాయాన్ని అందించాలి: గవర్నర్

అణగారిన ఆదివాసీలకు, అనాథలకు అవసరమైన సహాయాన్ని అందించాలని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పిలుపునిచ్చారు. బుధవారం రాజ్భవన్లో ఆయన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల అధిపతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద అనాథ బాలలకు, ఆదివాసీలకు అవసరమైన సహకారమివ్వాలని సూచించారు. సీఎస్ఆర్ కింద చేయగలిగిన 11రకాల సహాయాల ప్రతిపాదనలను ప్రభుత్వరంగ సంస్థల ప్రతినిధుల ముందు పెట్టింది.
Similar News
News January 1, 2026
చందన్వెల్లి చౌరస్తా.. ప్రపంచపు డిజిటల్ గల్లా పెట్టె!

వాట్సాప్ స్టేటస్ పెట్టినా, నెట్ఫ్లిక్స్లో మూవీ చూసినా ఆ డేటా వచ్చి చేరే ‘ప్రపంచపు డిజిటల్ లాకర్’ మన చేవెళ్లలో ఉంది. చందన్వెల్లి-షాబాద్ బెల్ట్ ఇప్పుడు అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ దిగ్గజాలకు అడ్డా. గ్లోబల్ కంపెనీలు ₹లక్షల కోట్లు కుమ్మరిస్తున్నాయి. RRR కనెక్టివిటీ తోడైతే ఇండియాకే ‘డిజిటల్ పవర్ హౌస్’ కానుంది. పొలాలకు C/O అడ్రసైన ప్రాంతం, ఇప్పుడు ప్రపంచపు డేటాకు సెక్యూరిటీ గార్డ్లా మారుతోంది.
News January 1, 2026
ఫ్యూచర్ సిటీ ముందున్న ‘కొత్త’ సవాళ్లు

కొత్తగా ఏర్పడిన ఫ్యూచర్ సిటీ ముందున్న కొత్త సవాళ్లను న్యూ ఇయర్ సందర్భంగా ఓ లుక్కేద్దాం. ఈ ప్రాంతమంతా కొండలతో ఉంటుంది. ఇక్కడ డ్రోన్లూ, GPS పెద్దగా పనిచేయకపోవచ్చనే చర్చ నడుస్తోంది. అకస్మాత్తుగా పరిధి మారడంతో అధికారుల మధ్య సంయవన లోపం ఏర్పడే అవకాశం లేకపోలేదు. అన్నింటికంటే ప్రధాన సమస్య రోడ్లపై ముందుగా దృష్టి సారించాల్సి ఉంటుంది. రూరల్ ఏరియా కావడం ప్రజా రావాణాను ముందు మెరుగుపరచాలి.
News January 1, 2026
HYD: మెట్రోపై సర్కార్ స్టడీ.. టెక్నికల్ కమిటీల ఏర్పాటు

HYD మెట్రో సర్కారు చేతుల్లోకి రానున్న దృష్ట్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రో రైల్ నిర్వహణ ఎలా ఉండాలనే విషయంపై అధికారులు సమాలోచనలో పడ్డారు. ఈ నేపథ్యంలో మెట్రో రైల్ను స్టడీ (అధ్యయనం) చేసేందుకు 2 టెక్నికల్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు మెట్రో రైల్ ఎండీ (ఇన్ఛార్జి) సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. ఈ కమిటీలు మెట్రోను పరిశీలించి త్వరలో నివేదిక సమర్పిస్తాయన్నారు.


