News October 17, 2024
ఆదివాసీలకు, అనాథలకు సహాయాన్ని అందించాలి: గవర్నర్

అణగారిన ఆదివాసీలకు, అనాథలకు అవసరమైన సహాయాన్ని అందించాలని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పిలుపునిచ్చారు. బుధవారం రాజ్భవన్లో ఆయన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల అధిపతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద అనాథ బాలలకు, ఆదివాసీలకు అవసరమైన సహకారమివ్వాలని సూచించారు. సీఎస్ఆర్ కింద చేయగలిగిన 11రకాల సహాయాల ప్రతిపాదనలను ప్రభుత్వరంగ సంస్థల ప్రతినిధుల ముందు పెట్టింది.
Similar News
News November 27, 2025
RR: తొలి విడతలో 7 మండలాలు.. 174 GPలు

రంగారెడ్డిలో మొత్తం 21 మండలాల్లో సర్పంచ్ ఎన్నికలు జరగాల్సి ఉంది. తొలి విడతలో నామినేషన్లను నేటి నుంచి స్వీకరిస్తున్నారు. కొత్తూరు(12), నందిగామ(19), కేశంపేట(29), కొందుర్గు(22), చౌదరిగూడ(24), ఫరూఖ్నగర్(47), శంషాబాద్ 21 జీపీలకు ఎన్నికలు జరుగుతాయి. మొత్తం 174 పంచాయతీల్లో 1530 వార్డులున్నాయి. 7 మండలాలకు 1530 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. డిసెంబర్ 11న ఎన్నిక, అదే రోజు ఫలితం వెలువడనుంది
News November 27, 2025
RR: సర్పంచ్ నామినేషన్లు.. ఇవి తప్పనిసరి!

RRలోని 21 మం.లో నేటి నుంచి సర్పంచ్ నామినేషన్లు ప్రారంభంకానున్నాయి. 526 GPలున్నాయి. అభ్యర్థులు.. ✔️ 21 ఏళ్ల వయస్సు ఉండాలి.✔️ గ్రామ ఓటర్ లిస్టులో పేరు ఉండాలి.✔️ SC/ST/BC వారు కుల సర్టిఫికేట్ జతచేయాలి.✔️ డిపాజిట్ సొమ్ము చెల్లించాలి.✔️ నేర చరిత్ర, ఆస్తులు, విద్యార్హతల అఫిడవిట్ ఇవ్వాలి.✔️ ఎలక్షన్ ఖర్చుపై డిక్లరేషన్ ఇవ్వాలి.✔️ ప్రతిపాదకుడు తప్పనిసరిగా అదే వార్డు/స్థానానికి చెందిన ఓటరు కావాలి.
News November 26, 2025
రంగారెడ్డి జిల్లాలో త్వరలో కొలువుదీరనున్న కొత్త పాలకవర్గాలు

2019 జనవరిలో పంచాయతీ ఎన్నికలను నిర్వహించగా పదవీకాలం 2024 జనవరితో ముగిసింది. అప్పటి నుంచి గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. దీంతో RR జిల్లాలో సర్పంచులు, వార్డ్ మెంబర్లు లేకపోవడంతో గ్రామాల్లో ఎక్కడికక్కడ సమస్యలు పేరుకుపోయాయి. దీనికి తోడు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు సైతం అందకపోవడంతో అభివృద్ధి పనులకు ఇబ్బందులు తప్పలేదు. నొటిఫికేషన్ రావడంతో త్వరలో కొత్త పాలకవర్గాలు కొలువుదీరనున్నాయి.


