News December 10, 2024
ఆదూరుపల్లిలో అమానుషం

నెల్లూరు జిల్లాలో అమానుష ఘటన వెలుగు చూసింది. చేజర్ల మండలం ఆదూరుపల్లి చర్చిలో ఎనిమిదేళ్ల గిరిజన బాలిక చనిపోయింది. అనారోగ్యానికి గురైన బాలికకు తానే ప్రార్థనలతో బాగుచేస్తానని పాస్టర్ చెప్పడంతో అక్కడే ఉన్నామని బాలిక బంధువులు ఆరోపిస్తున్నారు. నెల రోజులుపైగా చర్చిలోనే ఉంచడంతో సోమవారం రాత్రి ఆరోగ్యం క్షీణించి మృతిచెందిందని వాపోయారు. గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని స్వగ్రామం బాలాజీ రావు పేటకు తరలించారు.
Similar News
News October 15, 2025
ఉరేసుకుని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

మనుబోలు(M) కాగితాలపూరు క్రాస్ రోడ్లోని పంజాబీ డాబా పక్కనే ఉన్న పొదలలో ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం వెలుగు చూసింది. జట్లకొండూరుకు చెందిన కసుమూరు రమేశ్(18) వేప చెట్టుకు ఉరి వేసుకుని ఉండడాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. SI శివ రాకేశ్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గూడూరుకు తరలించారు.
News October 15, 2025
పింఛన్ల పునఃపరిశీలన మూడు రోజులు పాటు బంద్

జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహిస్తున్న పింఛన్ల పునఃపరిశీలన కార్యక్రమాన్ని మూడు రోజులు పాటు నిలిపివేసినట్లు డీఆర్డీఏ పీడీ నాగరాజకుమారి తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలో నేటి నుంచి మూడు రోజులు పాటు పర్యటించనున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని సచివాలయ సంబంధ శాఖ అధికారులు దివ్యాంగులకు తెలియజేయాలని సూచించారు.
News October 15, 2025
నెల్లూరు TDP నేతల తీరుపై పల్లా ఆగ్రహం..?

జిల్లా TDP నేతలపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇటీవల నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ప్రెస్ మీట్లు పెట్టడంపై అధిష్ఠానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇరువురు నేతలకు ఫోన్లు చేసి పార్టీ క్రమశిక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని, దానిని కాపాడుకోవాలని హితవు పలికారట.