News January 17, 2025
ఆదోనిలో పత్తి క్వింటా రూ.7,632

ఆదోని మార్కెట్లో చాలా రోజుల తర్వాత పత్తికి గిట్టుబాటు ధర లభిస్తోంది. మార్కెట్ యార్డులో నిన్న క్వింటా రూ.7,632 పలికింది. పత్తి కోతలు మొదలైనప్పటి నుంచి ఇదే అత్యధిక ధర. నిన్న 1,785 క్వింటాళ్ల సరకు మార్కెట్కు రాగా గరిష్ఠ ధర రూ.7,632, సరాసరి రూ.7,389, కనిష్ఠ ధర రూ.5,580తో అమ్మకాలు జరిగాయి.
Similar News
News February 14, 2025
కర్నూలు జిల్లాకు చెందిన DSP మృతి

కర్నూలు జిల్లా ఆస్పరికి చెందిన బంత్రోతి నాగరాజు(50) మృతిచెందారు. రాజమహేంద్రవరంలో సీఐడీ ప్రాంతీయ డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్న ఆయన.. కొంతకాలంగా కాలేయం, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతూ గతేడాది డిసెంబర్ వరకు మెడికల్ లీవ్లో ఉన్నారు. ఈనెల 2న తిరిగి విధుల్లో చేరారు. ఈ క్రమంలో గురువారం గాంధీపురం-3లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
News February 14, 2025
కర్నూలులో బర్డ్ ఫ్లూ తొలి కేసు.. రెడ్ జోన్గా ప్రకటన

కర్నూలులో తొలి బర్డ్ ఫ్లూ కేసు నమోదైంది. నగరంలోని నరసింహారావు పేటలో నమోదైనట్లు KMC ఆరోగ్య శాఖ అధికారులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. దీంతో నరసింహారావు పేట, పరిసర ప్రాంతాలను రెడ్ జోన్గా ప్రకటించినట్లు వెల్లడించారు. సంకల్ప్ బాగ్లో ఓ వ్యక్తి తన నివాసంలో కోడిని పెంచుకుంటున్నాడు. ఈ క్రమంలో ఉన్నట్టుండి ఆ కోడి చనిపోవడంతో పరీక్షలు చేయించాడు. పరీక్షలో బర్డ్ ఫ్లూ సోకినట్లు తేలడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
News February 13, 2025
ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ హాకీ పోటీలకు జిల్లా క్రీడాకారులు

ఈనెల 15 నుంచి 28వ తేదీ కాకినాడలో జరుగుతున్న ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ హాకీ పోటీలకు నర్సాపురం సచివాలయం అనిమల్ హస్బెండ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న రసూల్ ఖాన్, కొంగనపాడు సచివాలయం అనిమల్ హస్బెండ్ అసిస్టెంట్ మహేశ్ ఎంపికయ్యారు. గురువారం కర్నూలు కలెక్టరేట్లోని పశుసంవర్ధక శాఖ జేడీ శ్రీనివాసులు, కల్లూరు ఏవీహెచ్ అడిషనల్ డైరెక్టర్ పార్థసారథి ప్రత్యేకంగా అభినందించారు.