News March 31, 2025

ఆదోనిలో సచివాలయ ఉద్యోగి సూసైడ్

image

ఆదోని మండలం కపటి గ్రామ సచివాలయ ఉద్యోగి మధు సూసైడ్ చేసుకున్నాడు. శ్రీనివాసనగర్ కాలనీకి చెందిన మధు (26) కపటిలో డిజిటల్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్నారు. శనివారం సాయంత్రం డ్యూటీ నుంచి వచ్చి భోజనం చేసి మేడపై గదిలో పడుకున్నాడు. ఆదివాదం ఉదయం తల్లిదండ్రులు చూడగా .. అప్పటికే ఉరివేసుకుని చనిపోయాడు. తండ్రి నారాయణరావు ఫిర్యాదుతో త్రీ టౌన్ సీఐ రామలింగయ్య కేసు నమోదు చేశామన్నారు.

Similar News

News April 19, 2025

శ్రీనగర్ ASPగా కర్నూల్ వాసి.!

image

కర్నూలు జిల్లాకు చెందిన డాక్టర్ సందీప్ చక్రవర్తి జమ్మూ కాశ్మీర్‌‌లోని శ్రీనగర్ ASPగా నియమితులయ్యారు. శుక్రవారం జరిగిన IPS అధికారుల బదిలీల్లో జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఆయనను శ్రీనగర్ ASPగా నియమించింది. కర్నూలు జిల్లాకు చెందిన ఆయన కీలక పదవుల్లో చేయడంపై చిన్ననాటి సన్నిహితులు, కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

News April 18, 2025

మల్లన్న సేవలో సంగీత దర్శకుడు మణిశర్మ

image

శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్లను సినీ సంగీత దర్శకుడు మణిశర్మ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అర్చకులు ఆయనను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆయనతో పలువురు ఫొటోలు దిగారు. సమరసింహారెడ్డి, అన్నయ్య, ఖుషి, ఆది, ఇంద్ర, అతడు, నారప్ప, ఆచార్య వంటి ఎన్నో చిత్రాలకు మణిశర్మ సంగీతం అందించారు.

News April 18, 2025

నంద్యాల మెడికల్ విద్యార్థిని కాపాడిన ట్రైనీ IPS

image

నంద్యాలకు చెందిన యువకుడు తిరుపతి ఎస్వీ మెడికల్ కాలేజీలో మూడో సంవత్సరం చదువుతున్నాడు. జీవితంపై విరక్తిచెంది రామచంద్రాపురం మండల పరిధిలోని అడవిలో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు స్నేహితులకు చెప్పాడు. వారు పోలీసులను ఆశ్రయించగా.. రామచంద్రాపురంలో ట్రైనింగ్ తీసుకుంటున్న IPS బొడ్డు హేమంత్ స్పందించారు. 20 నిమిషాల్లో విద్యార్థి ఫోన్ ట్రేస్ చేసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. విద్యార్థిని కాపాడి కౌన్సెలిగ్ ఇచ్చారు.

error: Content is protected !!