News April 21, 2024
ఆదోని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిపై కేసు నమోదు
ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద ఎన్డీఏ అభ్యర్థి పార్థసారథిపై ఆదివారం కేసు నమోదైందని టూ టౌన్ సీఐ గోపి తెలిపారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా పార్థసారథి శుక్రవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారన్నారు. ఆ సమయంలో ఐదుగురికి బదులు 8 మంది వెళ్లడంతో మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, గుడిసె కృష్ణమ్మ, సూరం భాస్కర్ రెడ్డి, మరో నలుగురిపై 188 సెక్షన్ కింద కేసు నమోదు చేశామన్నారు.
Similar News
News September 30, 2024
కర్నూలు: మార్కెట్కు ఉల్లి సరకు తీసుకురావద్దు
కర్నూలు మార్కెట్కు రైతులు ఉల్లి సరకు తీసుకురావద్దని రైతులకు, కమిషన్ దారులకు మార్కెట్ ఎంపిక శ్రేణి కార్యదర్శి ఆర్.జయలక్ష్మి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వ్యవసాయ మార్కెట్లో అత్యధికంగా ఉల్లి వచ్చినందున మార్కెట్లో ఎక్కడా స్థలం కూడా ఖాళీ లేదని చెప్పారు. లారీలు వచ్చి వెళ్లడానికి కూడా ట్రాఫిక్ సమస్య ఉందని తెలిపారు.
News September 30, 2024
నంద్యాల: చెరువులో శిశువు మృతదేహం కలకలం
నంద్యాల పట్టణంలోని చెరువులో నెల వయసున్న శిశువు మృతదేహం సోమవారం కలకలం సృష్టించింది. అటుగా వెళుతున్న కొందరు సమాచారాన్ని పోలీసులకు అందించారు. చెరువు దగ్గరికి వచ్చి శిశువును పరిశీలించిన పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు. చెరువులో బతికి ఉన్న శిశువును పడేశారా లేదా చనిపోయిన శిశువును పడేశారా అని ప్రజలు చర్చించుకుంటున్నారు.
News September 30, 2024
దసరాకు 758 ప్రత్యేక బస్సులు
దసరా పండుగ సందర్భంగా APSRTC కడప జోన్ పరిధిలోని కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల పరిధిలో 758 ప్రత్యేక బస్సు సర్వీసులను నడపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఈ సర్వీసులు అక్టోబర్ 4వ తేదీ నుంచి ప్రారంభమవుతాయన్నారు. హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, చెన్నై, కర్నూలు, తిరుపతి, నెల్లూరు, ఒంగోలు తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తాయని అధికారులు అన్నారు.