News April 12, 2025

ఆదోని : గిఫ్ట్ షాప్ నడుపుతున్న వ్యక్తి కూతురు జిల్లా టాపర్

image

ఆదోని పట్టణంలో టీచర్స్ కాలనీలో నివాసం ఉంటున్న మల్లన్నగౌడ్ రెండో కూతురు రూప యంపీసీ ఫస్టియర్ లో 466/470 మార్కులతో జిల్లా టాపర్‌గా నిలిచింది. తండ్రి పట్టణంలో గిఫ్ట్ షాప్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. పిల్లలను ఉన్నత స్థాయిలో చూడాలని కష్టపడి చదివించినట్లు తెలిపారు. తన కష్టానికి ప్రతిఫలంగా కూతురు జిల్లా స్థాయిలో ర్యాంక్ సాధించడం ఆనందంగా ఉందన్నారు.

Similar News

News November 3, 2025

భక్తులు అప్రమత్తంగా ఉండాలి: కర్నూలు ఎస్పీ

image

కార్తీకమాసం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో దేవాలయాలు, నదీతీరాలకు తరలి వస్తున్న నేపథ్యంలో జాగ్రత్తలు తప్పనిసరి అని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. మహిళలు దీపాలు వెలిగించి వాటిని నదుల్లో వదిలే సమయంలో, స్నానాల సమయంలో జాగ్రత్తలు పాటించాలని, చిన్న పిల్లలతో మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. ఓర్వకల్ శ్రీ కాల్వబుగ్గ, రామేశ్వర, బ్రహ్మగుండేశ్వర, నందవరం దేవాలయంలో భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

News November 2, 2025

తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లి యువకుడి మృతి.!

image

మంత్రాలయం మండలం తుంగభద్ర గ్రామంలో ఆదివారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వీరేంద్ర తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లి మృతి చెందాడు. స్నానానికి వెళ్లిన యువకుడు ప్రమాదవశాత్తు నది ఉద్ధృతికి కొట్టుకుపోయి మరణించాడని స్థానికులు తెలిపారు. కొడుకును కోల్పోయిన తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. గ్రామస్థులు, స్నేహితులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

News November 1, 2025

స్పెషల్ ఆఫీసర్లు మండలాలకు వెళ్లాలి: కర్నూలు కలెక్టర్

image

కర్నూలు జిల్లాలో నియోజకవర్గ, మండల స్పెషల్ ఆఫీసర్లు ప్రతి వారం తప్పనిసరిగా మండలాలకు వెళ్లి ఆసుపత్రులు, పాఠశాలలు, హాస్టళ్లు, అంగన్వాడీ సెంటర్లు, సచివాలయాలను తనిఖీ చేయాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి ఆదేశించారు. కలెక్టరేట్‌లో జరిగిన ఇంటరాక్టివ్ సెషన్‌లో ఆమె మాట్లాడుతూ.. బీసీ హాస్టళ్లలో పదో తరగతి ఉత్తీర్ణతా శాతం పెంచాలన్నారు. హాస్టళ్లలో తాగునీరు, భోజనం, టాయిలెట్లపై చర్యలు చేపట్టాలని సూచించారు.