News April 5, 2025

ఆదోని మార్కెట్‌లో పెరిగిన పత్తి ధర.!

image

ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో ఈ ఏడాది మొదటి నెలలో రికార్డు స్థాయిలో పత్తి ధర నమోదైంది. శుక్రవారం యార్డుకు 659 బస్తాలు అమ్మకానికి వచ్చినట్లు అధికారులు తెలిపారు. పత్తి గరిష్ఠంగా రూ.8019 పలకగా కనిష్ఠంగా రూ.5016 పలికినట్లు వివరించారు. తెలుగు సంవత్సరాదిన రూ.8వేలు మార్క్ దాటడంతో శుభసూచికంగా మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

Similar News

News November 16, 2025

న్యూస్ అప్‌డేట్స్ @10AM

image

*ఛత్తీస్‌గఢ్‌ సుక్మా(D)లో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య కాల్పులు.. ముగ్గురు మావోయిస్టులు మృతి
*తిరుమల శ్రీవారి దర్శనం కోసం 31 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులు.. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 18 గంటల సమయం
*ఈనెల 19 లేదా DEC 7న TGలో స్వయం సహాయ సంఘాల సభ్యురాళ్లకు ఉచిత చీరల పంపిణీ
*మరో ఆపరేషన్ సిందూర్ జరగకూడదని, IND-PAK రిలేషన్స్ మెరుగుపడాలని ఆశిస్తున్నానన్న J&K Ex CM ఫరూక్ అబ్దుల్లా

News November 16, 2025

NLG: రేపటి నుంచి పత్తి కొనుగోళ్లు నిలిపివేత

image

కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీసుకువచ్చిన కొత్త నిబంధనలను వ్యతిరేకిస్తూ జిన్నింగ్ మిల్లుల యజమానులు సోమవారం నుంచి పత్తి కొనుగోళ్లు నిలిపివేయాలని నిర్ణయించారు. జిల్లా వ్యాప్తంగా 25 జిన్నింగ్ మిల్లులు ఉండగా తొలుత 9 సీసీఐ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. సీసీఐ విధించిన కొత్త నిబంధనలు రైతులు, తమకు ఆటంకంగా మారుతున్నాయని జిన్నింగ్ యజమానులు ఆరోపిస్తున్నారు.

News November 16, 2025

పల్నాడు యుద్ధ వీరుల ఆయుధాల గురించి మీకు తెలుసా.?

image

11వ శతాబ్దంలో పల్నాడు యుద్ధంలో వీరులు ఉపయోగించిన ఆయుధాలు నేటికీ సజీవంగా పూజలు అందుకుంటున్నాయి. మహామంత్రి బ్రహ్మనాయుడు ఉపయోగించిన నృసింహకృతం, బాలచంద్రుడు వాడిన సూర్య బేతాళం, సర్వ సైన్యాధ్యక్షుడు మాల కన్నమదాసు భైరవ ఖడ్గం నేటికీ కారంపూడి వీరుల దేవాలయం, మాచర్ల చెన్నకేశవస్వామి ఆలయంలో పూజింపబడుతున్నాయి. ఉత్సవాలకు వీటిని బయటకు తెచ్చి యుద్ధ రీతులలో ప్రదర్శించి ముగింపు అనంతరం తిరిగి భద్రపరుస్తారు.