News April 5, 2025

ఆదోని మార్కెట్‌లో పెరిగిన పత్తి ధర.!

image

ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో ఈ ఏడాది మొదటి నెలలో రికార్డు స్థాయిలో పత్తి ధర నమోదైంది. శుక్రవారం యార్డుకు 659 బస్తాలు అమ్మకానికి వచ్చినట్లు అధికారులు తెలిపారు. పత్తి గరిష్ఠంగా రూ.8019 పలకగా కనిష్ఠంగా రూ.5016 పలికినట్లు వివరించారు. తెలుగు సంవత్సరాదిన రూ.8వేలు మార్క్ దాటడంతో శుభసూచికంగా మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.

Similar News

News November 21, 2025

రిజర్వేషన్ల ఖరారుకు మంత్రివర్గం ఆమోదం.. రేపే జీవో

image

TG: గ్రామ పంచాయతీలు, వార్డుల రిజర్వేషన్ల విధివిధానాలు ఖరారు చేస్తూ పంచాయతీరాజ్ శాఖ రేపు GO ఇవ్వనుంది. రిజర్వేషన్లు 50% మించకుండా కొత్త రిజర్వేషన్లను సిఫార్సు చేస్తూ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన <<18332519>>నివేదికను<<>> రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. మంత్రులకు ఫైలు పంపించి ఆమోదిస్తున్నట్లు సంతకాలు తీసుకున్నారు. దీంతో రిజర్వేషన్లపై రేపు జీవో రానుంది. అనంతరం ఎన్నికల షెడ్యూల్ వెలువడనుంది.

News November 21, 2025

హనుమకొండ: తెలంగాణ గోల్డ్ కప్ టీ-20 టోర్నమెంట్‌కు సెలక్షన్స్

image

తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న తెలంగాణ గోల్డ్ కప్ 2025 T20 టోర్నమెంట్ కోసం జిల్లాలో క్రికెట్ జట్టు ఎంపికలు జరుగుతున్నట్లు రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి తెలిపారు. 23న వరంగల్ జిల్లా వారికి ఓ-సిటీ గ్రౌండ్స్‌లో, హనుమకొండ జిల్లా వారికి JNS స్టేడియంలో సెలక్షన్ ఉంటుందని, క్రీడాకారులు తప్పక హాజరుకావాలని వారు కోరారు.

News November 21, 2025

రానున్న ఐదు రోజులు భద్రాద్రి జిల్లాకు అతి తేలిక పాటి వర్షాలు

image

రానున్న ఐదు రోజులు భద్రాద్రి జిల్లాలో అతి తేలికపాటి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వాతావరణ హెచ్చరికలు ఏమీ లేవని చెప్పారు. గత కొద్ది రోజులుగా పొడి వాతావరణ ఉండడంతో రైతులు పత్తి పంటను సేకరించుకున్నారు. తిరిగి తేలికపాటి వర్షాలు ప్రారంభం కావడంతో పత్తి, వరి రైతులు నష్టపోయే అవకాశం ఉంది.