News February 16, 2025

ఆదోని: ‘రూ.లక్ష విలువ చేసే ఐఫోన్ పోలీసులకు ఇచ్చాడు’

image

ఆదోని మండలం పెద్దతుంబలం గ్రామానికి చెందిన కరీమ్ అనే యువకుడు రూ.లక్ష విలువ చేసే ఐఫోన్‌ను శుక్రవారం రాత్రి ఆదోని నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా పడేసుకున్నాడు. దొడ్డనగేరీకి వెళ్లే రహదారిలో చింతకాయల రమేశ్ అనే యువకునికి ఉదయం పొలానికి వెళ్తుండగా దొరికింది. వెంటనే స్థానిక వన్ టౌన్ సీఐ శ్రీరామ్‌కు అందజేసి, బాధితుడికి ఆయన ఆధ్వర్యంలో అందజేశారు. రమేశ్‌ను పోలీసులు అభినందించారు.

Similar News

News April 17, 2026

స్వీయ గణనలో భాగస్వాములు కావాలి: కలెక్టర్

image

జనగణన–2027 స్వీయ గణన కార్యక్రమంలో జిల్లా ప్రజలు చురుకుగా పాల్గొనాలని కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్ 16 నుంచి 30 వరకు కొనసాగే ఈ ప్రక్రియలో నిర్ణీత పోర్టల్ ద్వారా ఇంటి నుంచే వివరాలు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. డిజిటల్ విధానం పారదర్శకతను పెంచుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని ఆమె కోరారు.

News April 17, 2026

జీఎస్టీ వసూళ్లు పెంచాలి: కలెక్టర్ డా.ఏ.సిరి

image

కర్నూలు జిల్లాలో పన్ను చెల్లింపుదారులు సక్రమంగా జీఎస్టీ చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు. ప్రతి పరిశ్రమకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని ఆమె స్పష్టం చేశారు. పెండింగ్‌లో ఉన్న రూ.190 కోట్ల బకాయిలను త్వరగా వసూలు చేయాలని సూచించారు. కాంట్రాక్టర్లు, పరిశ్రమల చెల్లింపులను పర్యవేక్షించాలని ఆమె కోరారు. డీడీఓలు తప్పనిసరిగా జీఎస్టీ-టీడీఎస్ కింద నమోదు కావాలని పేర్కొన్నారు.

News April 17, 2026

కర్నూలు జిల్లాలో మహిళా ఓటర్లే అధికం!

image

కర్నూలు జిల్లాలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. జిల్లాలో 12,50,166 మంది పంచాయతీ ఓటర్లు ఉన్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. పురుషులు 6,21,167 మంది, మహిళలు 6,28,834 మంది, ఇతరులు 165 మంది ఉన్నారు. కర్నూలు జిల్లాలో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉండటంతో వారి ఓట్లే కీలకంగా మారనున్నాయి.