News January 8, 2025
ఆదోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో భారీ అవినీతి.. ఐదుగురు అరెస్టు

అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో ఆదోని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు సీనియర్ అసిస్టెంట్ ఈరన్న, జూ.అసిస్టెంట్ రమేశ్, డాక్యుమెంట్ రైటర్లు మహబూబ్, షబ్బీర్, సాక్షి ఇలియాస్ను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఈ మేరకు టూ టౌన్ సీఐ సూర్య మనోహర్ రావు వివరాలను వెల్లడించారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి రిమాండ్ విధించారన్నారు. వారిని సబ్ జైలుకు తరలించామని, ప్రధాన నిందితుల కోసం గాలిస్తున్నామని తెలిపారు.
Similar News
News November 22, 2025
కలెక్టర్ సిరి హెచ్చరిక

డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ కింద రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని, రోగుల నుంచి డబ్బు వసూలు చేస్తే చర్యలు తప్పవని కలెక్టర్ డా.ఏ.సిరి నెట్వర్క్ ఆసుపత్రి యాజమాన్యాలను హెచ్చరించారు. శుక్రవారం కర్నూలు కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్టీఆర్ వైద్య సేవకు సంబంధించి ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలతో సమీక్ష నిర్వహించారు. ఫిర్యాదులు అందితే ఆస్పత్రులపై చర్యలు తీసుకుంటామన్నారు.
News November 22, 2025
కె.నాగలాపురం పోలీస్ స్టేషన్లో ఎస్పీ వార్షిక తనిఖీ

కె.నాగలాపురం పోలీసు స్టేషన్ను ఎస్పీ విక్రాంత్ పాటిల్ తనిఖీ చేసి, రికార్డులను పరిశీలించారు. పెండింగ్ కేసులు, నిందితుల అరెస్టులు, దర్యాప్తుల పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టాలని, డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్పై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, శిక్షలు విధించాలని సూచించారు. ప్రాపర్టీ కేసులను ఛేదించి, రికవరీలు చేయాలని ఆదేశించారు.
News November 22, 2025
కె.నాగలాపురం పోలీస్ స్టేషన్లో ఎస్పీ వార్షిక తనిఖీ

కె.నాగలాపురం పోలీసు స్టేషన్ను ఎస్పీ విక్రాంత్ పాటిల్ తనిఖీ చేసి, రికార్డులను పరిశీలించారు. పెండింగ్ కేసులు, నిందితుల అరెస్టులు, దర్యాప్తుల పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు చేపట్టాలని, డ్రంక్ అండ్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్పై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, శిక్షలు విధించాలని సూచించారు. ప్రాపర్టీ కేసులను ఛేదించి, రికవరీలు చేయాలని ఆదేశించారు.


