News March 22, 2025
ఆధార్ నమోదు ప్రక్రియపై శ్రద్ధ వహించాలి: కలెక్టర్

గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో నిర్వహిస్తున్న వివిధ సర్వేలకు నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలని కలెక్టర్ నాగరాణి అన్నారు. శుక్రవారం భీమవరం కలెక్టరేట్లో జిల్లాలోని మండల అభివృద్ధి అధికారులతో మాట్లాడారు. పెండింగ్ ఫైల్స్ పరిష్కారానికి మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు ప్రతిరోజు సమీక్షించాలని, జిల్లాలో 10,748 వేల మంది పిల్లలు ఆధార్ నమోదు కాలేదని సత్వరమే ఆధార్ నమోదు ప్రక్రియపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు
Similar News
News March 26, 2025
ప.గో: ఆ గ్రామాలను దత్తత తీసుకోనున్న పవన్..!

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ కుటుంబ మూలాలున్న మొగల్తూరు, పెనుగొండ గ్రామాల అభివృద్ధికి ఆలోచన చేస్తున్నారు. ఈ నెల 28వ తేదీ ఉదయం మొగల్తూరు, సాయంత్రం పెనుగొండలో గ్రామ అభివృద్ధి సభలు నిర్వహించి ఆర్జీలను స్వీకరించాలని నిర్ణయించారు. ఉప ముఖ్యమంత్రి పేషీ అధికారులు ఈ సభలకి హాజరయ్యి ఆయా గ్రామాలకు కావల్సిన అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పనపై చర్చించి అర్జీలు స్వీకరిచి వాటిపై దృష్టిపెడతారు.
News March 25, 2025
‘గూడెం’ బార్ అసోసియేషన్ ఎన్నికల నగారా

తాడేపల్లిగూడెం బార్ అసోసియేషన్లో ఎన్నికల నగారా మోగింది. 2025 – 26వ సంవత్సరానికి సంబంధించి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకునేందుకు ఈ నెల 25, 26వ తేదీల్లో నామినేషన్ స్వీకరించనున్నారు. సాయంత్రం 4 గంటల వరకు నామినేషన్ స్వీకరించనున్నట్లు ఎన్నికల అధికారి ప్రవీణ్ ప్రకాశ్ మంగళవారం తెలిపారు. 26న సాయంత్రం స్క్రూట్నీ, 27న ఉపసంహరణ, 29న ఎన్నికలు జరుగుతాయన్నారు.
News March 25, 2025
ప.గో: ప్రాణాలు తీస్తున్న ఈత సరదా..!

గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలకు ఈత ఒక సరదా..! కానీ అదే ఈత పసిప్రాణాలను హరించేస్తోంది. ఏటా ఏదో ఒకచోట ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. దీని పర్యవసానంగా పలు కుటుంబాల్లో విషాదం అలముకుంటోంది. వేసవిలో ఒక పూట బడులు నిర్వహిస్తుండటంతో విద్యార్థులు సరదాకు కాలువ గట్లు, చెరువులు, కుంటల్లో ఈతకు వెళ్తున్నారు. అవి ఎక్కువ లోతు ఉండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. తల్లిదండ్రుల తమ పిల్లలపై ఒక కన్ను వేసి ఉంచాలి.