News April 3, 2024

ఆనం ఫ్యామిలీకే తక్కువ మెజార్టీ..!

image

ఆనం సంజీవ రెడ్డి 1958లో కాంగ్రెస్ తరఫున ఆత్మకూరులో పోటీ చేశారు. కేవలం 45 ఓట్ల తేడాతో MLAగా గెలిచారు. జిల్లాలో ఇప్పటి వరకు తక్కువ మెజార్టీ ఆయనదే. 1962లో వి.వెంకురెడ్డి ఇండిపెండెంట్‌గా బరిలో దిగి 86 ఓట్ల మెజార్టీతో MLAగా ఎన్నికయ్యారు. 2009లో నెల్లూరు సిటీలో ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి(PRP) కేవలం 90 ఓట్ల తేడాతో అనిల్ కుమార్ యాదవ్(CONG)పై గెలిచారు. తాజా ఎన్నికల్లో ఈ రికార్డ్ బ్రేక్ అవుతుందా?

Similar News

News December 17, 2025

నెల్లూరు కలెక్టర్‌కు CM ప్రశంస

image

అమరావతిలోని సచివాలయంలో బుధవారం CM చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా పాల్గొన్నారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యం అని CM చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. CM సూపర్ సిక్స్, సూపర్ హిట్ ప్రాజెక్ట్‌లో సక్సెస్ సాధించిన కలెక్టర్లను అభినందించారు. ఫైల్ క్లియరెన్స్‌లో 2వ స్థానం సాధించినందుకు హిమాన్షు శుక్లాను CM ప్రత్యేకంగా ప్రశంసించారు.

News December 17, 2025

భారత ఉపరాష్ట్రపతిని కలిసిన MP వేమిరెడ్డి

image

నెల్లూరు MP వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బుధవారం ఢిల్లీలో భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీలోని ఉపరాష్ట్రపతి కార్యాలయానికి బుధవారం MP వెళ్లారు. ఇందులో భాగంగా వేమిరెడ్డి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం వారు అంశాలపై చర్చించారు.

News December 17, 2025

నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైన్ పూర్తి చేయండి: MP

image

నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే లైన్ పూర్తి చేయాలని భారత రైల్వే బోర్డు ఛైర్మన్ సంతోశ్ కుమార్‌ను ఢిల్లీలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోరారు. బుధవారం ఆయన్ను MP మర్యాదపూర్వకంగా కలిశారు. బిట్రగుంట అభివృధ్ధి, ROB, RUBల పూర్తి, వివిధ ప్రాంతాల్లో ప్రధాన ట్రైన్లకు హాల్టింగ్ ఏర్పాటుపై చర్చించారు. జిల్లాలో రైల్వే పరిధిలో పెండింగ్లో ఉన్న అంశాలు, అభివృద్ధి కార్యక్రమాలపై సుదీర్ఘంగా చర్చించారు.